రంగారెడ్డి జిల్లా రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి...
By: chandrasekar Tue, 15 Dec 2020 8:02 PM
ఉపాధి కోసం ఇద్దరు
యువకులు కర్ణాటక నుంచి రంగారెడ్డి జిల్లా జన్వాడకు వచ్చారు. వారిలో ఒకరిని ప్రమాదం
రూపంలో మృత్యువు వెంటాడింది. జన్వాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు
అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.
శంకర్పల్లి నుంచి
జన్వాడకు ద్విచక్ర వాహనంపై కర్ణాటకకు చెందిన రాజు అనే వ్యక్తి, మరో
వ్యక్తితో కలిసి వెళ్తున్నాడు.
ఈ క్రమంలో జన్వాడ వద్ద
రోడ్డు ప్రక్కనే ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో రాజు (20) అక్కడికక్కడే
మృతి చెందగా అతనితో ఉన్న మరో వ్యక్తి తీవ్రంగా గాయాలపాలైనాడు.
ఉపాధి కోసం యువకులు
కర్ణాటక నుంచి జన్వాడకు వచ్చారు. పొట్టకూటి కోసం వచ్చి రోడ్డు ప్రమాదం రూపంలో
యువకుడు మృతి చెందడం శోచనీయం.
Tags :
man |
killed |
in road |
accident |