Advertisement

టైర్ పంక్చర్ ..డ్రైవర్ మృతి

By: Sankar Fri, 02 Oct 2020 7:00 PM

టైర్ పంక్చర్ ..డ్రైవర్ మృతి


గుంటూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. లారీ టైర్ పంక్చర్ డ్రైవర్ ప్రాణం పోయేందుకు కారణమైంది. పంక్చర్ టైర్ ఎక్కిస్తున్న లారీ డ్రైవర్లను ఆటో ఢీకొనడంతో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరొకరు తీవ్రగాయాలపాలయ్యారు. ఈ ఘటన పెదకాకాని మండలం కంతేరు అడ్డరోడ్డు వద్ద జరిగింది. చెన్నై నుంచి యూరియా లోడుతో పశ్చిమ బెంగాల్ వెళ్తున్న లారీ పంక్చరై నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో జాతీయ రహదారిపై ఆగిపోయింది.

లారీలో ఉన్న ఇద్దరు డ్రైవర్లు కిందకు దిగి పంక్చర్ అయిన టైరుని మార్చారు. అనంతరం పంక్చర్ అయిన టైర్‌ని లారీ వెనుక అమర్చేందుకు ప్రయత్నిస్తుండగా వేగంగా వచ్చిన ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తమిళనాడుకు చెందిన డ్రైవర్ వేలు నడిముత్తు(32) మృత్యువాతపడ్డాడు. మరో డ్రైవర్ రామ్‌రాజ్ సోలయరాజ్ తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆటో డ్రైవర్‌కి కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. పెదకాకాని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :
|
|
|

Advertisement