Advertisement

  • అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో భార్యను మరొక వ్యక్తిని కాల్చి చంపిన భర్త

అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో భార్యను మరొక వ్యక్తిని కాల్చి చంపిన భర్త

By: Sankar Mon, 27 July 2020 6:48 PM

అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో భార్యను మరొక వ్యక్తిని కాల్చి చంపిన భర్త



ఇటీవల కాలంలో అక్రమ సంబంధాల వలన హత్యలు ఎక్కువగా జరగడం చూస్తున్నాం ..ఇటీవల తెలంగాణలోని మేడ్చల్ జిల్లాలో అక్రమ సంబంధాల వలన కన్నా కూతురిని , కట్టుకున్న భర్తను కోల్పోయిన భార్య సంఘటన మరవకముందే మద్యప్రదేశ్ లో అలాంటి సంఘటనే ఇంకోటి జరిగింది ..వివాహేతర సంబంధం పెట్టుకుంది అన్న అనుమానంతో భార్యను , ఆమె ప్రియుడిని కాల్చి చంపాడు ఒక వ్యక్తి ..

హత్వారా ప్రాంతానికి చెందిన ఆనంద్‌యాదవ్‌ భార్య సరోజ(25)తో కలిసి నివాసం ఉండేవాడు. గ్వాలియర్‌లో కూలి పనులు చేసుకుంటూ నివసించే ఆనంద్‌యాదవ్‌ లాక్‌డౌన్‌ కారణంగా ఇటీవల స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. భార్య సరోజ అదే ప్రాంతానికి చెందిన నూనె వ్యాపారి అయిన హరియం అగర్వాల్‌(45)తో వివాహేతరం సంబంధం పెట్టుకుందని ఆనంద్‌యాదవ్‌ అనుమానిస్తుండేవాడు.

ఈ నేపథ్యంలో ఆనంద్‌ తుపాకితో భార్యను కాల్చి, అనంతరం తన మిత్రుడితో వెళ్లి హరియం అగర్వాల్‌ను కూడా కాల్చి చంపాడని ఏఎస్పీ సంజీవ్ సింగ్ కాంచన్ సోమవారం తెలిపారు. ప్రస్తుతం ఆనంద్‌యాదవ్‌ పరారీలో ఉన్నాడని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించామని, నిందితుడి కోసం గాలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

Tags :
|
|
|

Advertisement