Advertisement

శ్రీకాకుళం జిల్లాలో దారుణ ఘటన...!

By: Anji Tue, 03 Nov 2020 6:35 PM

శ్రీకాకుళం జిల్లాలో దారుణ ఘటన...!

శ్రీకాకుళం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పాతగొడవలను పెద్దల సమక్షంలో చర్చించుకుందామని పిలిచి కొట్టి చంపేసిన అమానుష ఘటన వెలుగుచూసింది. అయినవాళ్లే మూకుమ్మడిగా దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయాడు.

హిర మండలంలో జరిగిన ఈ దారుణ ఘటన వివరాలు.. హిర మండలానికి చెందిన కరణం తిరుపతిరావుకి అతని సమీప బంధువులతోనే వైరం ఉంది. నాలుగేళ్లుగా ఇరుకుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

పెద్దల సమక్షంలో కూర్చుని మాట్లాడుకుందామని రెండు రోజుల కిందట ఇరుకుటుంబాల వారు సమావేశమయ్యారు. అయితే అక్కడ కూడా ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో బంధువులు మూకుమ్మడిగా దాడి చేశారు.

తిరుపతిరావును దారుణంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Tags :

Advertisement