తెరిచి ఉన్న మ్యాన్ హోల్ లో పడి వ్యక్తి మృతి
By: Sankar Wed, 09 Dec 2020 9:30 PM
నగరాలలో మ్యాన్ హోల్స్ తెరిచి ఉండటం వలన అనేక ప్రమాదాలు సంభవిస్తున్న విషయం తెలిసిందే ..అధికారులకు ఎన్ని సార్లు చెప్పిన కూడా పట్టించుకునే నాథుడే ఉండడు..తాజాగా చెన్నై లో తెరిచి ఉంచిన మ్యాన్ హోల్ వలన ఒక వ్యక్తి తన ప్రాణాలను కోల్పోయాడు...
వివరాలు తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో బుధవారం ఈ ఘటన జరిగింది. ఇటీవల కురిసిన వర్షానికి నగరంలో కొడంబాకం వంతెన సమీపంలో రోడ్డుపై వరద నీరు నిలవడంతో మున్సిపల్ సిబ్బంది మ్యాన్హోల్ తెరిచారు. మధ్యాహ్నం అటుగా నడుచుకుంటూ వెళ్లిన అదే ప్రాంతానికి చెందిన డ్రైవర్ నర్సింహన్ (56) అందులో పడి ప్రాణాలు కోల్పోయాడు.
స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మ్యాన్హోల్ సమీపంలోకి రాగానే నర్సింహన్కు గుండెపోటు రావడంతో అందులో పడినట్లు మున్సిపల్ అధికారులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.