Advertisement

  • కరోనా సోకి ఉంటుందన్న అనుమానంతో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలకు సహకరించని గ్రామస్థులు

కరోనా సోకి ఉంటుందన్న అనుమానంతో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలకు సహకరించని గ్రామస్థులు

By: Sankar Mon, 10 Aug 2020 3:44 PM

కరోనా సోకి ఉంటుందన్న అనుమానంతో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలకు సహకరించని గ్రామస్థులు



కరోనా మానవ సంబంధాల మీద పెద్ద దెబ్బ కొట్టింది ..కరోనా వచ్చిన వ్యక్తిని మరియు ఆ కుటుంబాన్ని సమాజం వెలివేసినట్లు చూస్తుంది ..ఎన్ని అవగాహనా ప్రోగ్రామ్స్ పెట్టిన కూడా జనాల్లో మార్పు రావడం లేదు ..ఎందుకంటే కరోనా అంటూ వ్యాధి కావడంతో మనకు ఎక్కడ సోకుతుందో అని ప్రజలు బయపడుతున్నారు ..అయితే కరోనా వలన ఎవరైనా చనిపోతే కనీసం శవాన్ని కూడా యూరులోకి రానీయడంలేదు ..ఇలాంటి ఘటనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది..

పాల్వంచ సమీపంలోని నాగారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గండెపోటుతో మరణించాడు. కానీ కరోనా సోకి ఉంటుందనే అనుమానంతో గ్రామస్థులెవరూ అంత్యక్రియలకు సహకరించలేదు. దీంతో కుటుంబ సభ్యులు గంటల తరబడి నరకయాతన అనుభవించారు. గ్రామకార్యదర్శి, సర్పంచ్ అంత్యక్రియలకు పంచాయతీ ట్రాక్టర్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు.

దీంతో ఈ విషయం తెలుసుకున్న రంజిత్ అనే వ్యక్తి పొలంలో దమ్ము చేస్తున్న తన ట్రాక్టర్‌ను పంపించాడు. 5 కి.మీ. దూరం నుంచి ఆ ట్రాక్టర్‌ను తీసుకొచ్చి ముగ్గురి సహకారంతో ఆ మృతదేహాన్ని ఖననం చేశారు. ట్రాక్టర్‌ తమ వీధిలో నుంచి వెళ్లొద్దని గ్రామస్థులు గొడవ చేయడంతో కుటుంబ సభ్యులు తీవ్ర వేదనకు లోనయ్యారు.


Tags :
|
|

Advertisement