Advertisement

  • కూతురుకి విషమిచ్చి తాను కూడా ఆత్మహత్య చేసుకున్న తండ్రి

కూతురుకి విషమిచ్చి తాను కూడా ఆత్మహత్య చేసుకున్న తండ్రి

By: Sankar Thu, 06 Aug 2020 1:59 PM

కూతురుకి విషమిచ్చి తాను కూడా ఆత్మహత్య చేసుకున్న తండ్రి



ఆర్థిక ఇబ్బందులు తండ్రీ కూతురి ప్రాణాలు తీసిన విషాదకర ఘటన కామారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది. కామారెడ్డిలోని గోసంగి కాలనీలో నివాసముండే అక్బర్(48), కూతురు సైరాబేగం(5)తో కలిసి నివసిస్తున్నాడు. అతడి భార్య కొంతకాలం క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోవడంతో కూతురి ఆలనాపాలనా తానే చూస్తున్నాడు. రోడ్డుపై బొమ్ములు, బెలూన్లు విక్రయిస్తూ జీవిస్తున్నాడు.

అయితే లాక్‌డౌన్ కారణంగా కొద్ది నెలలుగా ఉపాధి లేకపోవడంతో అక్బర్‌కు ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. కూతురికి ఒక్కపూట కూడా తిండి పెట్టలేని స్థితికి చేరుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. కష్టాలతో బ్రతకడం కంటే చావే మంచిదని భావించాడు.

బుధవారం కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలిపి కూతురితో తాగించిన అక్బర్.. అనంతరం తాను కూడా తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :
|

Advertisement