Advertisement

  • కొడుకు పుట్టిన కొద్దిసేపటికే తండ్రి ఆత్మహత్య ..ఎందుకో తెలుసా !

కొడుకు పుట్టిన కొద్దిసేపటికే తండ్రి ఆత్మహత్య ..ఎందుకో తెలుసా !

By: Sankar Wed, 14 Oct 2020 08:36 AM

కొడుకు పుట్టిన కొద్దిసేపటికే తండ్రి ఆత్మహత్య ..ఎందుకో తెలుసా !


కర్నూలు జిల్లాలో విషాద ఘటన జరిగింది. కొడుకు పుట్టిన సంతోషాన్ని మర్చిపోకముందే గంటకే ఆత్మహత్య చేసుకున్నాడు ఓ తండ్రి. సి.బెళగల్‌కు చెందిన రాముడు, సత్యవతి దంపతుల కుమారుడు వినోద్‌కు దేవనకొండ నెల్లుబండకు చెందిన ప్రశాంతితో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది..

వినోద్‌ వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు.. వారికి మొదటి సంతానం ఓ కుమారుడు.. రెండో కాన్పునకు భార్యను పుట్టినింటికి పంపాడు. మంగళవారం ప్రశాంతికి పురిటినొప్పులు రావడంతో ఆమె తల్లిదండ్రులు కర్నూలులో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

రాముడు ముందు తన తల్లితో చెప్పి ఆమెను ఆస్పత్రికి పంపించాడు. తల్లి కుమారుడ్ని కూడా ఆస్పత్రికి రమ్మని కోరింది.. కానీ తన దగ్గర డబ్బులు లేకపోవడంతో ఆగిపోయాడు. సాయంత్రం ప్రశాంతి కుమారుడికి జన్మనిచ్చింది. కుమారుడ్ని వెళ్లి చూసేందుకు తన వద్ద డబ్బులు లేకపోవడంతో మనస్తాపం చెందిన రాముడు.. ఇంట్లో దూలానికి ఉరి వేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందలేదు.. రాముడు ఆత్మహత్యకు కారణాలు డబ్బు లేకపోవడమేనా.. మరేవైనా ఇతర కారణాలు ఉన్నాయా అన్నది తెలియాల్సి ఉంది.

Tags :
|
|
|

Advertisement