Advertisement

  • బాలికను బ్లాక్ మెయిల్ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ..

బాలికను బ్లాక్ మెయిల్ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ..

By: Sankar Wed, 29 July 2020 7:46 PM

బాలికను బ్లాక్ మెయిల్ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ..



ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి దానితో బాలికను లైంగికంగా వేధిస్తున్న వ్యక్తిని హైదరాబాద్ రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎర్రగడ్డ ప్రాంతానికి చెందిన సాయికుమార్‌ అనే యువకుడు చదువు మధ్యలో మానేసి సెంట్రింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లు క్రియేట్‌ చేసి దాని ద్వారా అమ్మాయిల అకౌంట్లను సెర్చ్ చేసేవాడు. అందమైన అమ్మాయిల ఫోటోలను డౌన్‌లోడ్ చేసుకుని వాటిని మార్ఫింగ్ చేసి ఫేక్ అకౌంట్ ద్వారా వారిని బ్లాక్‌మెయిల్ చేసేవాడు

ఈ క్రమంలోనే ఎల్బీనగర్‌కు చెందిన ఓ బాలికను మార్ఫింగ్ ఫోటోలతో ఇలాగే బెదిరించాడు. వాటిని బాలిక కుటుంబసభ్యులు, స్నేహితులకు పంపించాడు. ఆమె ఫోన్ నంబర్ తెలుసుకుని రోజూ అసభ్య మాటలతో వేధించడం మొదలుపెట్టాడు. దీంతో విసిగిపోయిన బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వారు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. టెక్నాలజీ సాయంతో పోలీసులు నిందితుడు సాయికుమార్‌‌ను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Tags :
|

Advertisement