తాను ఉండగానే వేరే మహిళతో సంబంధం పెట్టుకున్న భర్తకు దేహశుద్ధి చేసిన భార్య
By: Sankar Sun, 06 Sept 2020 12:24 PM
తనను పెళ్లి చేసుకొని మరొక మహిళతో సంబంధం నడుపుతున్న భర్తకు భార్య మరియు ఆమె తరుపు బంధువులు దేహ శుద్ధి చేసారు..ఈ సంఘటన నల్గొండ జిల్లా కేంద్రంలోని శ్రీనగర్ కాలనీలో చోటు చేసుకుంది.
నల్లగొండ జిల్లా కనగల్ మండలం ధర్వేశిపురం కు చెందిన మాధవి అనే మహిళతో చిట్యాల మండలం ఎలికట్టకు చెందిన సాయిబాబాకు 2011లో వివాహం జరిగింది. కారు డ్రైవర్ గా పనిచేసే సాయి బాబా భర్త చనిపోయిన ఒక మహిళతో సహజీవనం చేస్తున్న విషయం తెలిసి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలానే భర్త సదరు మహిళ ఇంట్లో ఉన్నాడన్న పక్క సమాచారంతో పోలీసులతో సహా అక్కడికి వెళ్లింది.
అయితే మూడు నెలలుగా ఇంటికి రాకుండా అక్కడే యా మహిళతో సహజీవనం చేస్తున్న భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకు అప్పచెప్పింది. ఈ క్రమంలో అతని భార్య, బంధువులు పోలీసుల ముందే అతనికి దేహ శుద్ది చేశారు.