Advertisement

  • కాకినాడ లో దారుణం ..భార్య తల మీద డంబెల్ తో బాదిన భర్త

కాకినాడ లో దారుణం ..భార్య తల మీద డంబెల్ తో బాదిన భర్త

By: Sankar Thu, 10 Sept 2020 9:12 PM

కాకినాడ లో దారుణం ..భార్య తల మీద డంబెల్ తో బాదిన భర్త


తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఓ భర్త బరి తెగించాడు. కట్టుకున్నాకభార్య అడ్డంగా ఉందని కడతేర్చడానికి పిల్లల ముందే వ్యాయామం చేసే డంబెల్ తో నెత్తిన బాదేశాడు. కన్న కూతుర్ల పై కూడా అసభ్యంగా ప్రవర్తించాడు ఆ నీచుడు.

కాకినాడ కొవ్వూరు తారకరామ నగర్ కు చెందిన శ్రీను ఏపీఎస్ఆర్టీసిలో డ్రైవర్ చెడు వ్యసనాలకు బానిసైన అతను ఇంట్లో భార్యను కొన్నేళ్లుగా వేధిస్తున్నాడు. రెండేళ్ళ కిందట తన భార్య బంధువు ఇంటికి వస్తే ఆమెను చెరబట్టాడు. విషయం తెలిసిన భార్య పోలీస్ కేసు పెట్టింది. అయితే ప్రభుత్వ ఉద్యోగి కావడంతో పోలీసులు అతనికి వార్నింగ్ ఇచ్చి వదిలేసారు.

ప్రభుత్వ ఉద్యోగం పోతుందని బంధువులు చెప్పడంతో భార్య మాధవి కేసు విత్ డ్రా చేసుకుంది. అప్పటి నుంచి శ్రీను తన భార్యపై కక్ష పెట్టుకున్నాడు..రక రకాలుగా వేధిస్తున్నాడు..కొన్ని నెలల కిందట హత్యాయత్నం చెయ్యగా బంధువులు అడ్డుకున్నారు. చివరకు నిన్న రాత్రి డంబెల్ తో నెత్తిపై బాదాడు. అటు సెల్ ఫోన్ లో నీలి చిత్రాల వీడియోలకు అలవాటు పడి ఇంట్లో కూతుర్లతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని బాధితురాలు ఆరోపిస్తోంది.

Tags :
|
|

Advertisement