Advertisement

  • యువతిని కత్తితో పొడిచి పొదల్లో పడేసిన ఉన్మాది..

యువతిని కత్తితో పొడిచి పొదల్లో పడేసిన ఉన్మాది..

By: Sankar Fri, 30 Oct 2020 12:27 PM

యువతిని కత్తితో పొడిచి పొదల్లో పడేసిన ఉన్మాది..


ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాలలో యువతుల మీద దాడులు అధికం అయ్యాయి...మొన్నటికి మొన్న విజయవాడలో తేజస్విని హత్యోదంతం మరువకముందే తెలంగాణలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. యువతిని కత్తితో పొడిచి పొదల్లో పడేశాడో దుర్మార్గుడు. అక్కడి నుంచి పారిపోతూ చేతులపై రక్తంతో పోలీసులకు దొరికిపోవడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ అమానుష ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో జరిగింది.

పట్టణంలోని సత్యనారాయణపురం ప్రాంతంలో యువతిపై కత్తితో దాడి ఘటన కలకలం రేపింది. ఉన్మాదిగా మారిన యువకుడు ఆమెపై కత్తితో దాడి చేసి పొదల్లో పడేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోతూ నైట్ పెట్రోలింగ్ పోలీసులకు కనిపించాడు. యువకుడి చేతులపై రక్తం ఉండడంతో అప్రమత్తమైన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో దారుణ ఘటన బయటపడింది.

యువతిపై కత్తితో దాడి చేసినట్లు చెప్పడంతో వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి యువతిని రక్షించారు. ముళ్లపొదల్లో అపస్మారక స్థితిలో పడి ఉన్న యువతిని వెంటనే ఇల్లెందు ఆస్పత్రికి తరలించారు. యువతి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

Tags :
|
|
|
|

Advertisement