Advertisement

  • భారత ఆర్మీ రహస్యాలను పాక్ కు చేరవేస్తున్న వ్యక్తి అరెస్ట్

భారత ఆర్మీ రహస్యాలను పాక్ కు చేరవేస్తున్న వ్యక్తి అరెస్ట్

By: chandrasekar Tue, 25 Aug 2020 8:33 PM

భారత ఆర్మీ రహస్యాలను పాక్ కు చేరవేస్తున్న వ్యక్తి అరెస్ట్


భారత దేశానికీ సంబంధించిన ఆర్మీ రహస్యాలను పాక్ కు చేరవేస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేసారు. భారత ఆర్మీకి సంబంధించిన రహస్యాలను పాక్ గడ్డకు చేరవేస్తున్న ఓ డబుల్ ఏజెంట్‌ను రాజస్థాన్ ఏటీఎస్ (యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్) అరెస్ట్ చేసింది. అతడి ల్యాప్‌టాప్ నుంచి కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని ముస్తాక్ అలీ ఖాన్ (40)గా గుర్తించారు. ఇతడు రాజస్థాన్‌లోని పాక్ సరిహద్దులో ఇండియన్ ఆర్మీకి చెందిన కీలక స్థావరాలను రహస్యంగా వీడియోలు తీసి ఐసిస్ ఉగ్రవాదులకు పంపించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో పాటు కీలక సమాచారాన్ని చేరవేసినట్లు తెలుస్తోంది. అతడు చాల రహస్య వివరాలను పాకిస్థాన్ కు గత సంవత్సరం రోజులుగా చేరవేస్తున్నారు.

భారత్ ఆర్మీకి చెందిన అత్యంత సున్నితమైన అంశాలను ఓ గూఢచారి పాక్ గడ్డకు చేరవేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఏడాది కాలంగా నిఘా పెట్టి కీలక ఆధారాలు అందించాయి. వాటి ఆధారంగా ఏటీఎస్ బృందం నిందితుడిని అరెస్టు చేసింది. నిందితుడు రాజస్థాన్‌లోని బార్మర్‌లో నివాసం ఉంటున్నాడు. స్థానిక పోలీసులు ఇటీవల నకిలీ నోట్లు కలిగి ఉన్న ఓ వ్యక్తి కుమారుడిని అరెస్టు చేశారు. అతడి ద్వారా ముస్తాక్ అలీ ఖాన్ గురించి పోలీసులకు వివరాలు తెలిశాయి. దీంతో ఏటీఎస్‌కు సమాచారం ఇచ్చారు.

విచారణలో భాగంగా ముస్తాక్ అలీ జీ-మెయిల్ అకౌంట్‌ను పరిశీలించి భారత సైన్యం, స్థావరాలకు సంబంధించిన అనేక సున్నితమైన అంశాలను గుర్తించారు. పలు వీడియోలను గుర్తించారు. నిందితుడు 5 ఫేస్‌బుక్ అకౌంట్లను నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అతడి ఫ్రెండ్స్ లిస్టులో ఎక్కువ మంది పాకిస్థానీయులే ఉన్నారు. నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థలకు చెందిన పలు బృందాలు విచారిస్తాయని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు తమకు లభించిన ఆధారాల ఆధారంగా నిందితుడిని ప్రశ్నించనున్నట్లు ఇంటెలిజెన్స్ ఏడీజీ ఉమేశ్ మిశ్రా తెలిపారు. ఇలాంటి వారిపై కఠినంగా శిక్షించాలని అందరూ కోరుకుంటున్నారు.

Tags :
|
|

Advertisement