ఫేస్బుక్లో సచిన్పై తప్పుడు పోస్టు పెట్టిన వ్యక్తి అరెస్ట్
By: chandrasekar Sat, 08 Aug 2020 4:24 PM
ఫేస్బుక్లో సచిన్పై
తప్పుడు పోస్టు పెట్టిన గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన వ్యక్తి అరెస్ట్
చేయబడ్డాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్పై అసభ్యకర పోస్టులు పెట్టిన
యువకుడ్ని అరెస్ట్ చేశారు ముంబై పోలీసులు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన
నాగరాజు అనే యువకుడు సచిన్పై తన ఫేస్బుక్లో అసభ్యకరంగా పోస్టులు పెట్టారు.
తర్వాత కుటుంబాన్ని కూడా టార్గెట్ చేశాడు.
ఈ విషయమై ముంబై సైబర్
క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు వెళ్లడంతో వారు నేరుగా గుంటూరు జిల్లా పిడుగురాళ్ల
చేరుకున్నారు. నేరుగా అతడి ఇంటికి వెళ్లిన పోలీసుల్ని చూసి షాకైన నాగరాజుకు విషయం
అర్ధంకాలేదు. వివరాలు తెలిసికొన్న అతను సోషల్ మీడియాలో చేసిన తప్పుకు అడ్డంగా
దొరికిపోయినాడు. నాగరాజు ఐపీ అడ్రస్ ద్వారా ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు
పిడుగురాళ్ల వచ్చారు. అతడి మొబైల్, తండ్రి
ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. నాగరాజు ఆ రెండు మొబైల్స్ను ఉపయోగించి పోస్టులు
పెట్టినట్లు తేల్చారు.
పిడుగురాళ్ల పోలీస్
స్టేషన్కి తీసుకెళ్లి అక్కడ పోలీసులకు సమాచారం ఇచ్చి అక్కడ జరగాల్సిన ప్రొసీజర్
పూర్తి చేశారు. అక్కడి నుంచి నేరుగా ముంబై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి
తరలించారు. ఫేస్బుక్లో పోస్టులతో యువకుడు అడ్డంగా దొరికిపోయాడు. పోలీసులు పదే, పదే సోషల్ మీడియాలో పోస్టుల విషయంలో జాగ్రత్తగా
ఉండమని చెప్పినా కొందరు పట్టించుకోవడం లేదు.