Advertisement

  • బాలికను కిడ్నాప్ చేసి అశ్లీల చిత్రాలు తీసిన వ్యక్తి అరెస్టు

బాలికను కిడ్నాప్ చేసి అశ్లీల చిత్రాలు తీసిన వ్యక్తి అరెస్టు

By: chandrasekar Mon, 21 Sept 2020 5:21 PM

బాలికను కిడ్నాప్ చేసి అశ్లీల చిత్రాలు తీసిన వ్యక్తి అరెస్టు


ఉత్తర ప్రదేశ్‌లోని అజామ్‌ఘర్‌ జిల్లాలో దారుణం... పాయింట్‌ బ్లాక్‌లో గన్‌పెట్టి బాలికను అపహరించిన వ్యక్తి ఆమెతో అశ్లీల చిత్రాలు తీశాడు.

అజామ్‌ఘర్‌కు చెందిన సలీమ్ అదే ప్రాంతానికి చెందిన ఓ బాలికను ఇటీవల చంపుతానని బెదించి అపహరించాడు.

ఆమెను ఓ చోట బంధించి అశ్లీల చిత్రాలు తీశాడు. ఆదివారం బాధితురాలు అతడి బారి నుంచి తప్పించుకొని వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం పంపామని కేసు దర్యాప్తు చేస్తున్నామని అజామ్‌ఘర్‌ డీఎస్పీ రాజేశ్‌ తివారీ తెలియ చేసారు.

Tags :
|

Advertisement