Advertisement

ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు రైతులు మృతి...!

By: Anji Fri, 09 Oct 2020 2:21 PM

ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు రైతులు మృతి...!

తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై పొలం వెళ్తున్న రైతులను వేగంగా వచ్చిన లారీ వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు రైతులు మృత్యువాతపడ్డారు. ఆలమూరు మండలం జొన్నాడ వద్ద జాతీయ రహదారిపై పెట్రోల్ బంకు సమీపంలో ఈ ఘటన జరిగింది.

మూలస్థాన అగ్రహారానికి చెందిన రైతులు కర్రి విష్ణు, ఇనపకోళ్ల శ్రీను, తోరాటి రాంప్రసాద్ పొలం పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై రావులపలెం వైపు వెళుతుండగా లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్పాట్‌లోనే మృతి చెందినట్లు తెలుస్తోంది.

మరొకరు తీవ్రగాయాలతో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న ఆలమూరు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Advertisement