Advertisement

ఘోర రోడ్డు ప్రమాదం.. 1 మృతి,4 గిరికి గాయాలు..!

By: Anji Thu, 05 Nov 2020 4:18 PM

ఘోర రోడ్డు ప్రమాదం.. 1 మృతి,4 గిరికి గాయాలు..!

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ట్రాక్టర్ ఆటోని ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. జిల్లాలోని వలేటివారిపాలెం మండలం రామలింగాపురం వద్ద ఈ ప్రమాదం జరిగింది.

వేగంగా దూసుకొచ్చిన ట్రాక్టర్ ఆటోని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను 108 అంబులెన్సులో కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Tags :

Advertisement