కారు కొనాలనుకునే వారికీ బంపర్ ఆఫర్ ప్రకటించిన మహీంద్రా అండ్ మహీంద్రా
By: Sankar Mon, 14 Dec 2020 2:53 PM
కారు కొనడం అనేది చాల మందికి ఒక కలలాగ ఉంటుంది ..అయితే ఒకప్పుడు కారు కేవలం ధనవంతుల దగ్గర మాత్రమే ఉడేది కానీ ఇప్పుడు జనరేషన్ లో సామాన్య మధ్య తరగతి ప్రజలు కూడా కారు కొంటున్నారు..అలాంటివారికి ఇంకా సౌలభ్యం గా ఉండేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా ఇయర్ ఎండ్ ఆఫర్ రూపం లో బంపర్ ఆఫర్ ప్రకటించింది...
ఇటీవల విడుదల చేసిన థార్ ఎస్యూవీ మినహా దాదాపు అన్ని మోడళ్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. అధికారిక వెబ్సైట్లోఅందించిన సమాచారం ప్రకారం బీఎస్-6 వాహనాలపై ఏకంగా 3.06 లక్షల వరకు తగ్గింపు లభించనుంది. నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ , అదనపు ఆఫర్లు ఇందులో భాగం.
ఈ ఆఫర్ ఈ నెల(డిసెంబర్ 31, 2020)చివరి వరకు మాత్రమే చెల్లుతాయి. అలాగే ఆయా నగరాలు, ప్రాంతాల ఆధారంగా డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉండనుంది