మహారాష్ట్రలో కొత్తగా 11,447 పాజిటివ్ కేసులు మరియు 306 మరణాలు నమోదు
By: chandrasekar Sat, 17 Oct 2020 10:12 AM
దేశంలో చాలా చోట్ల కరోనా
ఉదృతి కొంతవరకు నిలకడగా వున్నా మహారాష్ట్రలో మాత్రం రోజు రోజుకి విజృంభిస్తూ
వుంది. మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభన కొనసాగుతున్నది. ప్రతి రోజు పది
వేలకుపైగా కరోనా కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. గురువారం నుంచి
శుక్రవారం వరకు కొత్తగా 11,447 పాజిటివ్ కేసులు, 306 మరణాలు నమోదయ్యాయి.
ఇప్పటివరకు మహారాష్ట్రలో
మొత్తం కరోనా కేసుల సంఖ్య 15,76,062కు, మరణాల సంఖ్య 41,502కు పెరిగింది. మరోవైపు గత 24
గంటల్లో 13,885 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం
సంఖ్య 13,44,368కి చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
ఇప్పుడు రాష్ట్రంలో 1,89,715 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు పేర్కొంది. కాగా, దేశంలో కరోనా కేసులు, మరణాలపరంగా మహారాష్ట్ర తొలిస్థానంలో
కొనసాగుతున్నది. ప్రజలందరూ మాస్కులు ధరించి బయటకు రావాలని సాంఘీక దూరం పాటించడం
వల్ల కొంతవరకైనా కరోనా ని అరికట్టవచ్చు.