Advertisement

  • విధి నిర్వహణలో పోలీసులు ముందు ఉండి పోరాడుతున్నారు ..హోమ్ మంత్రి అలీ

విధి నిర్వహణలో పోలీసులు ముందు ఉండి పోరాడుతున్నారు ..హోమ్ మంత్రి అలీ

By: Sankar Thu, 25 June 2020 5:41 PM

విధి నిర్వహణలో పోలీసులు ముందు ఉండి పోరాడుతున్నారు ..హోమ్ మంత్రి అలీ



తెలంగాణలో కరోనా నిర్ములనకు పగలు రాత్రి అనే తేడా లేకుండా కష్టపడుతున్న పోలీసులకు కరోనా వస్తుండటంతో అందరూ ఆందోళన చెందుతున్నారు..ప్రజల కోసం పోరాడుతున్న పోలీసులు ఇలా కరోనా బారిన పడటంతో హోమ్ మంత్రి మొహమ్మద్ అలీ మీడియాతో మాట్లాడారు ..గురువారం ఆయన మాట్లాడుతూ మొదటి నుంచి ధైర్యాన్ని కోల్పోకుండా అధికారులు విధులు నిర్వర్తించారని తెలిపారు. ఇప్పుడు చిన్న స్థాయి అధికారి నుండి పెద్దస్థాయి అధికారి వరకు కరోనా బారిన పడుతున్నారని, ఎవరు మనోధైర్యాన్ని కోల్పోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ పోలీస్ అకాడమీలో కూడా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని భయాందోళనలకు గురికావొద్దని అభ్యర్థులకు ఆయన సూచించారు. కరోనా బారిన పడిన పోలీసులు తిరిగి కోలుకుని విధుల్లోకి చేరారని, చిత్తశుద్ధితో బాధ్యతలు నిర్వహిస్తున్నందుకు గర్వపడుతున్నానని తెలిపారు. లాక్‌డౌన్‌ నుంచి నేటి వరకు విధి నిర్వహణలో పోలీసు అధికారులు ఎప్పుడు ముందున్నారని మహమూద్‌ అలీ పేర్కొన్నారు.

Tags :
|
|

Advertisement