Advertisement

  • తెలంగాణాలో కరోనా తో మరొక పోలీస్ ఉన్నతాధికారి మృతి ..తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన పోలీస్ డిపార్ట్మెంట్

తెలంగాణాలో కరోనా తో మరొక పోలీస్ ఉన్నతాధికారి మృతి ..తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన పోలీస్ డిపార్ట్మెంట్

By: Sankar Tue, 11 Aug 2020 07:27 AM

తెలంగాణాలో కరోనా తో మరొక పోలీస్ ఉన్నతాధికారి మృతి ..తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన పోలీస్ డిపార్ట్మెంట్



కరోనా వైరస్ మహమ్మారికి తెలంగాణాలో మరొక పోలీస్ ఉన్నతాధికారి మరణించారు ..కోవిడ్ బారిన పడి మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ డీఎస్పీ ప్రాణాలు వదిలారు. మహబూబాబాద్ జిల్లా పోలీసు ఆఫీసులో ఏఆర్ విభాగంలో పని చేస్తున్న పీఎస్ శశిధర్ (50) కరోనాతో చనిపోయారు. హైదరాబాద్ నాంపల్లి కేర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం ఆయన తుదిశ్వాస విడిచారు. శశిధర్ మరణ వార్త తెలియగానే ఎస్పీ కోటిరెడ్డి, జిల్లా పోలీసు యంత్రాంగం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.

శశిధర్ మహబూబాబాద్ జిల్లాలో ఏడాదిన్నరపాటు సేవలు అందించారు. 1996 బ్యాచ్ ఆర్ఎస్సైగా పోలీస్ శాఖలో చేరిన ఆయన.. బెల్లంపల్లి హెడ్ క్వార్టర్స్‌లో విధులు నిర్వర్తించారు. తర్వాత కరీంనగర్, సిరిసిల్లలో పని చేసి.. డీఎస్పీగా ప్రమోషన్ పొంది మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చారు. ఆయన స్వస్థలం వరంగల్.

బాచుపల్లి ఎస్సై మహ్మద్ యూసుఫ్ గత గురువారం కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇటీవలే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్యాధికారి అయిన డాక్టర్ నరేశ్ కుమార్ కూడా కరోనాకు బలయ్యారు.

Tags :
|
|
|

Advertisement