ప్లాస్మా దానం చేస్తా అని ప్రకటించిన మధ్యప్రదేశ్ సీఎం
By: Sankar Mon, 10 Aug 2020 3:12 PM
కరోనా మహమ్మారి నిర్ములనలో ప్లాస్మా తెరపై అద్భుత ఔషధం లాగ పనిచేస్తుంది అని అనేక నివేదికలు వెల్లడిస్తున్నాయి..దీనితో ప్లాస్మా థెరపీ మీద అన్ని ప్రభుత్వాలు ప్రజల్లో అవగాహనా కల్పించే ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నాయి ..అయితే ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ మాత్రం తాను ప్లాస్మా దానం చేస్తాను అని ప్రకటించాడు..
జులై 25వ తేదీన ముఖ్యమంత్రి చౌహాన్ను కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో భోపాల్లోని చిరాయు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందిన విషయం విదితమే. ఆగస్టు 5వ తేదీన ఆస్పత్రి నుంచి సీఎం డిశ్చార్జి అయ్యారు.
తనకు కరోనా వైరస్ సోకడంతో ఆస్పత్రి చేరి రికవరీ అయ్యాను. ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నాను. కరోనాతో పోరాడే యాంటీబాడీస్ తన శరీరంలో అభివృద్ధి చెందాయి. ఈ క్రమంలో తాను త్వరలోనే ప్లాస్మా డొనేట్ చేస్తానని సీఎం ప్రకటించారు. ప్రస్తుతానికి చౌహాన్ హోం క్వారంటైన్లో ఉన్నారు.