ఏఆర్ రెహమాన్కు మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ
By: chandrasekar Sat, 12 Sept 2020 12:32 PM
మద్రాస్ హైకోర్టు ఆస్కార్
విజేత, బహుభాషా
సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్కు నోటీసులు
జారీచేసింది. పన్ను ఎగవేత కేసుకు సంబంధించి ఆదాయపు పన్ను అధికారులు దాఖలు చేసిన
వ్యాజ్యంపై తమకు సమాధానం ఇవ్వాలని ఆయన్ని హైకోర్టు ఆదేశించింది. రింగ్టోన్లు కంపోజ్ చేసి
ఇచ్చేందుకు బ్రిటన్కు చెందిన టెలికాం కంపెనీతో రెహమాన్ ఒప్పందం చేసుకున్నారు.
దీనికోసం రూ.3.47కోట్ల భారీ పారితోషికం తీసుకున్నారు.
కానీ, ఆ
మొత్తాన్ని రెహమాన్ తన ఆదాయంగా చూపించకుండా ట్రస్టుకు బదిలీ చేశారని ఆదాయపన్ను
అధికారులు ఆయనపై కేసు నమోదు చేశారు. దీనిపై కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా ఐటీ
తరపు న్యాయవాది మాట్లాడుతూ తన సేవల ద్వారా పొందిన ఆదాయానికి రెహమాన్ పన్ను
కట్టకపోవడం నేరమని అన్నారు. తీసుకున్న పారితోషికానికి సంబంధించి పన్ను కట్టకుండా ఎగవేతకు పాల్పడిన
ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన మద్రాస్ హైకోర్టు రెహమాన్కు
శుక్రవారం నోటీసులు జారీచేసింది. ఐటీ అధికారులు దాఖలు చేసిన వ్యాజ్యంపై సరైన వివరణ
ఇవ్వాలని నోటీసుల్లో తెలిపింది.