రానా , కోహ్లీలకు నోటీసులు జారీ చేసిన మద్రాస్ హై కోర్ట్ ...ఎందుకో తెలుసా !
By: Sankar Tue, 03 Nov 2020 4:22 PM
ఆన్లైన్ గ్యాంబ్లింగ్పై సెలబ్రిటీలకు మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గ్యాంబ్లింగ్కు అనుకూల ప్రకటనల్లో నటించిన క్రికెటర్లు విరాట్ కొహ్లి, సౌరవ్ గంగూలీ, సినీ నటులు దగ్గుపాటి రానా, సుదీప్, ప్రకాశ్ రాజ్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఈ నెల 19లోగా సమాధానం ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఆన్లైన్ గ్యాంబ్లింగ్ కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ పై మద్రాస్ హైకోర్టు ఈ రోజు విచారణ జరిపింది. ఆన్లైన్ గ్యాంబ్లింగ్లో వందలాది మంది డబ్బులు పొగొట్టుకున్నారని పిటిషినర్ తెలిపాడు.
విచారణ చేపట్టిన హైకోర్టు.. ఆన్లైన్ గ్యాంబ్లింగ్కు మద్దతుగా ప్రకటనల్లో నటించిన సెలబ్రిటీలకు నోటీసులు అందించింది. ఈ ప్రకటనల్లో ఎందుకు నటించాల్సి వచ్చిందో ఈ నెల 19లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.