Advertisement

సీనియర్ బీజేపీ లీడర్ కైలాష్ సారంగ్ మృతి...!

By: Anji Sun, 15 Nov 2020 12:34 PM

సీనియర్ బీజేపీ లీడర్ కైలాష్ సారంగ్ మృతి...!

బీజేపీకి చెందిన సీనియర్ నేత, మధ్యప్రదేశ్ సీనియర్ బీజేపీ లీడర్ కైలాష్ సారంగ్ (85) అనారోగ్య సమస్యలతో మరణించారు.

వృద్ధాప్యం కారణంగా అనారోగ్యం బారిన పడ్డ కైలాష్, ముంబైలోని ఓ ఆసుపత్రిలో గత 12 రోజులుగా చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించి మరణించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కైలాష్ కుమారుడు విశ్వాస్ సారంగ్ ప్రస్తుతం మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు.

కైలాష్ సారంగ్‌కు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కైలాష్ సారంగ్‌ మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం తెలియజేశారు. కైలాష్ కష్టపడి పనిచేసే నాయకుడిగా పేరుతెచ్చుకున్నారని ఆయన అన్నారు.

రాష్ట్రాభివృద్ధికి ఆయనెంతో శ్రమించారని, ఆయన కుటుంబీకులకు తన సంతాపాన్ని తెలుపుతున్నానని.. కైలాష్ మృతిపట్ల ఆయన కుటుంబానికి మరియు శ్రేయోభిలాషులకు సంతాపం తెలియజేస్తున్నాను’అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

Tags :

Advertisement