Advertisement

  • అభిమానుల నిరీక్షణ ముగిసింది...437 రోజుల తర్వాత మైదానంలో ధోని

అభిమానుల నిరీక్షణ ముగిసింది...437 రోజుల తర్వాత మైదానంలో ధోని

By: Sankar Sun, 20 Sept 2020 07:49 AM

అభిమానుల నిరీక్షణ ముగిసింది...437 రోజుల తర్వాత మైదానంలో ధోని


మహేంద్ర సింగ్ ధోని 437 రోజుల తరువాత తిరిగి గ్రౌండ్ లోకి అడుగుపెడుతున్నాడు. 2019 వరల్డ్ కప్ సెమిస్ మ్యాచ్ తరువాత తిరిగి గ్రౌండ్ లోకి అడుగుపెట్టలేదు. అయితే, ఐపీఎల్ మ్యాచ్ లకు ముందు ఆగష్టు 15 వ తేదీన సాయంత్రం 7:29 గంటలకు ఇంస్టాగ్రామ్ ద్వారా తాను రిటైర్ అవుతున్నట్టు ప్రకటించాడు.

7:29 గంటల నుంచి క్రికెట్ కు రిటైర్ అవుతున్నట్టు భావించాలని ప్రకటించడంతో ధోని ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఆగష్టు 15 వ తేదీ సాయంత్రం 7:29 కి ఫ్యాన్స్ కు షాకిచ్చిన ధోని, సెప్టెంబర్ 19 వ తేదీ సాయంత్రం 7:30 గంటలు ఐపీఎల్ 13 వ సీజన్ ద్వారా తిరిగి గ్రౌండ్ లోకి అడుగుపెట్టి రీ ఎంటర్టైన్మెంట్ చేయబోతున్నాడు. రాత్రి 7:30 గంటలకు గ్రౌండ్ లోకి అడుగుపెట్టగానే ధోని ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు.

ఇక తొలి మ్యాచ్ లో ధోని బ్యాటింగ్ విన్యాసాలు చూదాం అనుకున్న ప్రేక్షకులకు కొంచెం నిరాశ కలిగినప్పటికీ , ధోని ఎప్పటిలాగే తనకు మాత్రమే సాధ్యమైన నిర్ణయాలతో అదరగొట్టాడు..కృనల్ పాండ్య ఇచ్చిన క్యాచ్ ను డైవ్ చేసి మరి అందుకున్న ధోని తనలో ఇంకా ఔర్ తగ్గలేదు అని నిరూపించాడు..ఇక తొలి మ్యాచ్ లోనే బ్యాటింగ్ లో తన ప్రయోగాలతో జడేజా , కర్రన్ లను తనకంటే ముందు బ్యాటింగ్ కు పంపి ప్రత్యర్థికి షాకిచ్చాడు..ఇక ధోని లో జోష్ ఏ మాత్రం తగ్గకపోవడంతో తల ఫాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు..

Tags :
|
|

Advertisement