Advertisement

  • దక్షిణ అండమాన్‌ సముద్రంలో అల్పపీడనం...ఏపీలో భారీ వర్షాలు

దక్షిణ అండమాన్‌ సముద్రంలో అల్పపీడనం...ఏపీలో భారీ వర్షాలు

By: chandrasekar Mon, 30 Nov 2020 6:16 PM

దక్షిణ అండమాన్‌ సముద్రంలో అల్పపీడనం...ఏపీలో భారీ వర్షాలు


దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. సోమవారం రాత్రి వాయుగుండంగా మారనుంది. ఈ ప్రభావంతో వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్రం వద్ద కేంద్రీకృతమైన ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.

తొలుత వాయుగుండంగా మారే ఈ అల్పపీడనం తర్వాత 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి పశ్చిమ వాయవ్యదిశగా పయనిస్తూ డిసెంబర్‌ 2న దక్షిణ తమిళనాడు తీరాన్ని తాకే అవకాశం ఉందని అభిప్రాయం పడుతున్నారు.

ఈ ప్రభావంతో డిసెంబరు 1 నుంచి 3 వరకు తమిళనాడు, పుదుచ్చేరిలోని కరైకల్‌లో అతి భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్‌ సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. మరోవైపు నివర్ తుఫాన్ ముప్పు తప్పినా ఇంకా రాష్ట్రంలో వర్షాలు పడుతూనే ఉన్నాయి.

ఆదివారం రాయలసీమ దక్షిణ కోస్తా ప్రాంతాల్లో చాలాచోట్ల భారీవర్షం కురిసింది. గడిచిన 24 గంటల్లో కందుకూరులో 9 సెం.మీ., కావలిలో 6, వెలిగండ్ల, సీతారామపురం, కొనకనమిట్లల్లో 3, వింజమూరు, వెంకటగిరి, బెస్తవారిపేట, ఉదయగిరి, పొదిలిల్లో 2 సెం.మీ. వర్షపాతం నమోదైంది. నివర్ తుఫాన్‌తో నష్టపోయిన రైతాంగం మళ్లీ వాయుగుండం అనడంతో ఆందోళన పడుతున్నారు.

Tags :
|
|

Advertisement