వచ్చే నాలుగు రోజుల్లో కోస్తాంధ్రలో అతి భారీ నుంచి భారీ వర్షాలు
By: Sankar Thu, 13 Aug 2020 10:51 AM
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఇది రెండు రోజులు అక్కడే స్థిరంగా కొనసాగి, మరింత బలపడుతుందని పేర్కొంది.
దీని ప్రభావంతో రాబోయే నాలుగు రోజులు కోస్తాంధ్ర, యానాంలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు, రాయలసీమలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు.
తీరంలో గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, 3.5 మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడి సముద్రం అల్లకల్లోంగా ఉంటుందని వివరించాారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణశాఖ హెచ్చరించింది. కాగా, కోస్తాంధ్రలో బుధవారం ముసురు వాతావరణం నెలకొంది. విశాఖ, ఉభయగోదావరి, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి.