తెలంగాణాలో దారుణంగా పడిపోతున్న రాత్రిపూట ఉష్ణోగ్రతలు
By: Sankar Wed, 11 Nov 2020 9:43 PM
తెలుగు రాష్ట్రాల్లో చలిగాలులు ప్రజలను వణికిస్తున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చలి తీవ్రత బాగా పెరుగుతోంది.
తెలంగాణలో సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రాత్రి టెంపరేచర్లు 6 డిగ్రీలు తక్కువగా ఉంటున్నాయని వాతావరణ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. చలిగాలులతోపాటు పొగమంచు కురుస్తుండటంతో ప్రజలు బయటకి రావడానికి జంకుతున్నారు..
రాత్రి పూట ఉష్ణోగ్రతలు అతి దారుణంగా పడిపోతున్నాయి. అటు ఉత్తర ఈశాన్యం నుంచే కాదు.. తూర్పు నుంచి కూడా తేమగాలులు స్టార్ట్ అవబోతున్నాయి. అత్యల్పంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని గిన్నెధరి గ్రామంలో 7.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్ మండలంలో 8 డిగ్రీలు, నిర్మల్ జిల్లాలోని కుభీర్లో 8.9 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండలం కాస్లాబాద్లో 9.4, మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం భాగ్యనగర్ నందనవనం ప్రాంతంలో 9.8 డిగ్రీలు, జిన్నారంలో 9.9డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగత్రలు నమోదయ్యాయి.