Advertisement

  • నల్గొండ జిల్లాలో విషాదం ..ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమ జంట

నల్గొండ జిల్లాలో విషాదం ..ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమ జంట

By: Sankar Wed, 09 Sept 2020 10:26 AM

నల్గొండ జిల్లాలో విషాదం ..ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమ జంట


నల్గొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కేతేపల్లి మండలం బొప్పారం శివారులో ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పురుగుల మందు తాగి ఇద్దరూ అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని తెల్లవారుజామున అటుగా వెళ్లిన స్థానికులు గుర్తించారు.

ఇదే విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలియజేశారు. కేతేపల్లి పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతులు కేతేపల్లి మండలం గుడివాడకు చెందిన రాచకొండ శ్రీను, చిత్తలూరి నాగేశ్వరిగా గుర్తించారు.ఇద్దరు గత కొంతకాలంగా ప్రేమించుకున్నట్లుగా తెలిసింది. అయితే వీరి మధ్య ప్రేమ కొనసాగుతుండగానే ఆరు నెలల కిందట శ్రీనుకు వేరే అమ్మాయితో వివాహం జరిగింది. ఆ తరవాత కూడా ఇద్దరూ తరుచూ కలుసుకునే వారని సమాచారం.

ఈ నేపథ్యంలోనే ఇద్దరు కలిసి మంగళవారం ఇంటి నుంచి బయటకు వచ్చారు. తమ గ్రామం పక్కనే ఉన్న బొప్పారం గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావి వద్దకు చేరుకున్నారు.అక్కడే ఇద్దరు కలిసి చాలా సేపు గడిపినట్లు తెలిసింది. తరువాత కూల్ డ్రింక్స్ లో పురుగుల మందు కలుపుకుని తాగినట్లు ఘటన స్థలంలో పరిస్థితిని బట్టి తెలుస్తున్నది. కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ఏరియా దవాఖానకి తరలించారు.

Tags :
|

Advertisement