Advertisement

లారీ,కారు ప్రమాదం-ఐదుగురు మృతి

By: Dimple Thu, 03 Sept 2020 01:16 AM

లారీ,కారు ప్రమాదం-ఐదుగురు మృతి

ఇసుక లారీ అతి వేగం ఐదుగురు యువకులను బలితీసుకుంది. అప్పటి వరకు ఆనందంగా గడిపిన యువకులను ఇసుక లారీ రూపంలో మృత్యువు కబలించింది. స్నేహితుడి సోదరుడు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న వారు అంతలోనే విగతజీవులుగా మారారు. దీంతో ఆ కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాలిలా ఉన్నాయి.. వరంగల్‌ రూరల్‌ జిల్లా దామెర మండలం పసరగొండ క్రాస్‌ వద్ద బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు.

కాళేశ్వరం నుంచి వరంగల్‌ వైపు వేగంగా వస్తున్న ఇసుక లారీ ఈ యువకులు ప్రయాణిస్తున్న కారును ఢీకొనడంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో వరంగల్‌ అర్బన్‌ జిల్లా పెద్దమ్మగడ్డకు చెందిన కండె జయప్రకాశ్‌(23), పోచమ్మమైదాన్‌కు చెందిన మేకల రాకేశ్‌(23), హసన్‌పర్తికి చెందిన గజవెల్లి రోహిత్‌(20), ములుగుకు చెందిన కొండబోయిన నరేశ్‌(23), వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేటకు చెందిన షేక్‌ సాబీర్‌(19) ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు ప్రమాద సమాచారం తెలియగానే పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయ టకు తీశారు. అక్కడ లభించిన ఆధారాలతో వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

పెద్దమ్మగడ్డకు చెందిన కండె జయప్రకాశ్‌ డిగ్రీ చదువుతున్నాడు, నర్సంపేటకు చెందిన షేక్‌ సాబీర్‌ ఆటోనగర్‌లో ఉంటూ బేకరీలో పని చేస్తున్నాడు. హసన్‌పర్తికి చెందిన గజవెల్లి రోహిత్, ములుగుకు చెందిన కొండబోయిన నరేశ్, పోచమ్మమైదాన్‌కు చెందిన మేకల రాకేశ్‌ కూలి పని చేస్తున్నారు. రాకేశ్‌ సోదరుడు ప్రవీణ్‌ పుట్టిరోజు సందర్భంగా కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం రాత్రి రాకేశ్‌ తన స్నేహితులను ఆహ్వానించాడు.

వేడుకల్లో ఆరుగురు కలసి పార్టీ చేసుకున్నారు. అర్ధరాత్రి కావడంతో ములుగుకు బస్సులు లభించవని, నరేశ్‌ను ఇంటి దగ్గర దింపేందుకు హన్మకొండలోని ఓ స్నేహితుని దగ్గర నుంచి కారును తీసుకొచ్చారు. ఆ ఐదుగురు యువకులు కారులో బయలుదేరారు. తెల్లవారు జామున పసరగొండ క్రాస్‌ వద్దకు రాగానే కారు మరో వాహనాన్ని ఓవర్‌ టేక్‌ చేస్తున్న సమయంలో లారీ వేగంగా వచ్చి కారును ఢీ కొట్టింది.

దీంతో కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద స్థలాన్ని ఇన్‌చార్జి డీసీపీ వెంకటలక్ష్మి బుధవారం పరిశీలించారు. మృతదేహాలను ఎంజీఎంకు తరలించారు. రాకేశ్‌కు వివాహం అయింది. 3 నెలల కూతురు ఉంది. కాగా,రాత్రి అయిందంటే కాళేశ్వరం నుంచి పెద్ద ఎత్తున ఇసుక లారీలు తరలి వెళుతుంటాయని జాతీయ రహదారిపై ప్రయాణం చేయాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తోందని స్థానికులు అంటున్నారు.

ఐపీఎల్‌ వార్మప్ మ్యాచ్ లు పెట్టండి

lorry,car,accident,warangal ,లారీ,కారు ప్రమాదం-ఐదుగురు మృతి

ఐపీఎల్ 13వ సీజన్ ఆరంభానికి ఇంకా కొన్ని రోజులే ముగిలి ఉంది. క్వారంటైన్ పూర్తి చేసుకున్న జట్లు ప్రస్తుతం ప్రాక్టీస్ లో బిజీబిజీగా గడుపుతున్నాయి. అయితే సీజన్ ఆరంభానికి ముందు వార్మప్ మ్యాచ్ లు నిర్వహించాలని పలు ఫ్రాంచైజీలు బీసీసీఐని కోరాయి. ప్రధాన టోర్నీకి ముందు ఈ మ్యాచ్ లతో అన్ని జట్లకూ ఉపయోగకరంగా ఉంటుందని బోర్డుకు తెలిపాయి.

కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి జరగబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఈ టీ ట్వంటీ ఫెస్టివల్ గురించి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇంకా ఫ్రాంచైజీలు, ఆటగాళ్ళ గురించి వేరే చెప్పాలా... ఇప్పటికే క్వారంటైన్ పూర్తి చేసుకున్న జట్లు నెట్స్ లో చెమటోడ్చుతున్నాయి. చాలా కాలంగా ఆటకు దూరమైన క్రికెటర్లంతూ మళ్ళీ మునపటి ఫామ్ అందిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ నేపథ్యంలో సీజన్ ప్రారంభానికి ముందు వార్మప్ మ్యాచ్ లు నిర్వహించాలని పలు ఫ్రాంచైజీలు బీసీసీఐ ముందుకు ప్రతిపాదన తెచ్చాయి. ఈ ప్రాక్టీస్ మ్యాచ్ లతో అన్ని జట్లకూ ఉపయోగం ఉంటుందని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. కరోనా ప్రభావంతో దాదాపు ఐదు నెలలుగా ఆటకు దూరమైన క్రికెటర్లకు ఈ వార్మప్ మ్యాచ్ లతో మేలు చేకూరుతుందని బోర్డుకు వివరించాయి.

దీనికి తోడు లీగ్ బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ కూడా వార్మప్ మ్యాచ్ లు నిర్వహిస్తే ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు రెడీగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాక్టీస్ మ్యాచ్ లకు కూడా మంచి రేటింగ్ వస్తుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో ఫ్రాంచైజీల ప్రతిపాదనపై బోర్డు కూడా సానుకూలంగానే స్పందించింది. అయితే పూర్తి షెడ్యూల్ ప్రకటించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఫ్రాంచైజీలకు తెలిపింది. ఒకవేళ బీసీసీఐ అంగీకరిస్తే... సెప్టెంబర్ 11 నుంచి 16 వరకూ వార్మప్ మ్యాచ్ లు నిర్వహించే అవకాశముుంది.

Tags :
|
|

Advertisement