- హోమ్›
- వార్తలు›
- బాలికను కిడ్నాప్ చేసి రైల్ ఎక్కిన కిడ్నాపర్ ...రైలును తీసుకెళ్లి పోలీసుల ముందు ఆపిన లోకో పైలట్
బాలికను కిడ్నాప్ చేసి రైల్ ఎక్కిన కిడ్నాపర్ ...రైలును తీసుకెళ్లి పోలీసుల ముందు ఆపిన లోకో పైలట్
By: Sankar Tue, 27 Oct 2020 06:05 AM
బాలికను కిడ్నప్ చేసి రైలు ఎక్కి పారిపోదాం అనుకున్న కిడ్నపర్ కు రైల్ లోకో పైలట్ షాకిచ్చాడు ...కిడ్నాపర్ రైలు ఎక్కడన్నా విషయం తెలుసుకున్న లోకో పైలట్ పోలీసుల సూచనా మేరకు రైలు మధ్యలో ఎక్కడ ఆపకుండా సక్కగా భోపాల్ తీసుకువచ్చి పోలీసుల ముందు ఆపాడు ..
మూడేళ్ల బాలికను అపహరించిన ఓ వ్యక్తి లలిత్పూర్ రైల్వే స్టేషన్లో భోపాల్ వెళ్లే ఓ రైలెక్కాడు. కిడ్నాపర్ ఆ రైలెక్కడం గమనించిన బాలిక తల్లిదండ్రులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. లలిత్పూర్ స్టేషన్లోని రైల్వే పోలీసులు వెంటనే సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించారు. కిడ్నాపర్ ఆ బాలికతను తీసుకొని రప్తిసాగర్ ఎక్స్ప్రెస్ ఎక్కినట్లు గుర్తించారు..
రైల్వే పోలీస్ ఇన్స్పెక్టర్ వెంటనే ఉన్నతాధికారులతో సంప్రదించి లోకో పైలట్తో మాట్లాడారు. కిడ్నాప్ ఉదంతం గురించి ఆయనకు వివరించి ఆ ట్రెయిన్ భోపాల్ వరకు ఎక్కడా ఆపకుండా తీసుకెళ్లాలని సూచించారు. దానికి ట్రెయిన్ ఆపరేటర్ సరేనన్నారు. దీంతో ఉత్తర్ ప్రదేశ్లోని లలిత్పూర్ స్టేషన్ నుంచి బయల్దేరిన ఆ ట్రెయిన్ మధ్యలో ఏ స్టేషన్లోనూ ఆగకుండా సుమారు 243 కి.మీ. దూరం ప్రయాణించి నేరుగా భోపాల్ స్టేషన్లో ఆగింది.
లలిత్పూర్ రైల్వే పోలీసులు భోపాల్ పోలీసులను అప్రమత్తం చేశారు. బాలికతో పాటు ఉన్న కిడ్నాపర్ ఫోటోలను వారికి పంపించారు. దీంతో భోపాల్ పోలీసులు ఆ కిడ్నాపర్ను పట్టుకోవడానికి రంగం సిద్ధం చేశారు. ట్రెయిన్ అక్కడికి చేరుకోవడానికి ముందే ప్లాట్ఫామ్ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. రప్తిసాగర్ ఎక్స్ప్రెస్ భోపాల్ స్టేషన్లో ఆగగానే.. ఓ కంపార్ట్మెంట్ నుంచి కిడ్నాపర్ను పట్టుకున్నారు. బాలికను అతడి చెర నుంచి విడిపించారు. ఆ తర్వాత ఆ బాలికను సురక్షితంగా ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు.