Advertisement

  • విజయనగరం ఎంఆర్ కాలేజీ గ్రౌండ్‌ గేటుకు తాళాలు...

విజయనగరం ఎంఆర్ కాలేజీ గ్రౌండ్‌ గేటుకు తాళాలు...

By: chandrasekar Tue, 15 Dec 2020 9:35 PM

విజయనగరం ఎంఆర్ కాలేజీ గ్రౌండ్‌ గేటుకు తాళాలు...


విజయనగరం మాన్సాస్ ట్రస్ట్ ఎంఆర్ కాలేజీ గ్రౌండ్‌ గేటుకు తాళాలు వేశారు. గేటుకు నోటీసు అంటించారు. విద్యార్థులు, కాలేజీ సిబ్బంది తప్ప వేరేవారు లోపలికి రావడానికి వీలు లేదని నోటీసులో తెలిపారు. ఈ నిర్ణయంపై స్థానికులు అవాక్కైనారు. మాన్సాస్ యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా కాలేజీ మైదానంలో వాకింగ్ చేస్తున్నామని ఇప్పుడు తాళాలు వేయడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

విజయనగరంలో ప్రసిద్ధి చెందిన ‘ఎంఆర్‌ కాలేజీ’ని ప్రైవేటుపరం చేస్తారనే విషయం పై రచ్చ ప్రారంభమైంది. దీనిపై చర్యలు తీసుకునేందుకు వీలుగా వెంటనే సమగ్ర నివేదిక పంపించాలంటూ కళాశాల విద్య స్పెషల్‌ కమిషనర్ రాజమండ్రి రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌కు లేఖ రాశారు.

ఈ కాలేజీని ప్రైవేట్‌పరం చేయడంపై పూసపాటి వంశీయులు తప్పుబడుతున్నారు. ఉన్నత విద్యామండలి వీటిని పరిశీలిస్తోంది దీనిపై ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే మహారాజా కాలేజీ కూడా ప్రైవేటు పరం కానుంది. ఎంఆర్‌ కాలేజీ వ్యవహారంపై ఆనంద గజపతిరాజు మరో కుమార్తె పూసపాటి ఊర్మిళ గజపతి స్పందించారు. మహారాజా కళాశాలను ప్రైవేటుపరం చేయాలనుకోవడం సరైన నిర్ణయం కాదన్నారు.

Tags :

Advertisement