Advertisement

అద్వానీతో కేక్ కట్ చేయించిన ప్రధాని మోదీ...!

By: Anji Sun, 08 Nov 2020 1:42 PM

అద్వానీతో కేక్ కట్ చేయించిన ప్రధాని మోదీ...!

బీజేపీ కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీకి ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

భారత ప్రజానీకానికి, బీజేపీ శ్రేణులకు అద్వానీ ఓ సజీవ ప్రేరణ అని ప్రధాని కొనియాడారు. 93వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకొంటున్న ఆయన.. సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు.

అద్వానీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆయన నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు.

అద్వానీకి పుష్పగుచ్చం అందిచి.. ఆయన కాళ్లకు దండం పెట్టి ఆశీర్వదం తీసుకున్నారు. ఈ సందర్భంగా అగ్రనేత అద్వానీతో వారంతా కలిసి కేక్ కట్ చేయించారు.

అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్న సమయంలో హోం మంత్రి బాధ్యతలు నిర్వర్తించి కీలకంగా నిలిచారని అన్నారు. దేశాభివృద్ధితోపాటు పార్టీని విజయతీరాలకు చేర్చడంలో అద్వాణీ కృషి నిరుపమానమన్నారు.

ఇదిలాఉంటే.. బీజేపీ అగ్రనేత అద్వానీ పుట్టిన రోజు సందర్భంగా దేశవ్యాప్తంగా బీజేపీ నేతలందరూ ఆయనకు శుభాకాంక్ష‌లు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా వేదికల ద్వారా తమ అభిమాన నేతను కొనియాడుతూ పోస్టులు చేస్తున్నారు.

Tags :

Advertisement