Advertisement

14 ఏళ్ల బాలికను చంపిన సింహాలు

By: chandrasekar Wed, 23 Dec 2020 10:06 AM

14 ఏళ్ల బాలికను చంపిన సింహాలు


గుజరాత్ జునాఘ‌డ్ జిల్లాలోని ధన్ఫులియా గ్రామంలో 14 ఏళ్ల బాలికను సింహం చంపినట్లు అటవీ శాఖ అధికారి మంగళవారం తెలిపారు. జునాఘ‌డ్ డివిజన్‌లోని వంతాలి రేంజ్ ఫారెస్ట్ ఏరియాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వలస వ్యవసాయ కూలీల కుటుంబానికి చెందిన ఇద్దరు బాలికలు సోమవారం అర్థరాత్రి బయటకు వెళ్లారు. బాలికలు బయటకు వెళ్ళినప్పుడు రెండు సింహాలు దాడి చేశాయి. ఇద్దరిలో ఒకరిని తెల్లవారుజామున 2 గంటలకు సింహం లాక్కెళ్లి చంపినట్లు అటవీ డిప్యూటీ కన్జర్వేటర్ సునీల్ బెర్వా తెలిపారు. అధికారులు అందించిన వివరాల ప్రకారం సింహం అనుకోకుండా ఒక బాలిక పై దాడి చేయడంలో ఇంకొక అమ్మాయి ప్రక్కనున్న వాటర్ ట్యాంక్‌లోకి దూకి తప్పించుకోగలిగింది.

ఆ బాలిక చేసిన అరుపులు కారణంగా సమీపంలో ఉన్న మా అటవీ సిబ్బంది శబ్దం విన్న తరువాత అక్కడికి చేరుకున్నారు. ఆ దాడిలో మృతి చెందిన బాలిక ప్రక్కనే రెండు సింహాలు వున్నాయి. ఆ తరువాత అవి వెళ్లిన వెంటనే మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. హత్యకు గురైన బాలికను భావన గా గుర్తించారు. ఆ బాలిక పంచమహల్ జిల్లాలోని గోద్రాకు చెందిన వ్యవసాయ కూలీల కుటుంబానికి చెందినది. సింహాన్ని బంధించుటకు ఆ ప్రాంతంలో బోనులను ఏర్పాటు చేసినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. గత ఆరు నెలల నుండి ఈ ప్రాంతంలో సింహాలు తిరుగుతున్నట్లు అవి పశువులను వేటాడేందుకు అక్కడ వస్తున్నట్లు స్థానికులు తెలిపారు.

Tags :
|
|
|
|
|

Advertisement