14 ఏళ్ల బాలికను చంపిన సింహాలు
By: chandrasekar Wed, 23 Dec 2020 10:06 AM
గుజరాత్ జునాఘడ్
జిల్లాలోని ధన్ఫులియా గ్రామంలో 14 ఏళ్ల బాలికను సింహం చంపినట్లు అటవీ శాఖ అధికారి
మంగళవారం తెలిపారు. జునాఘడ్ డివిజన్లోని వంతాలి రేంజ్ ఫారెస్ట్ ఏరియాలో ఈ సంఘటన
చోటుచేసుకుంది. వలస వ్యవసాయ కూలీల కుటుంబానికి చెందిన ఇద్దరు బాలికలు సోమవారం
అర్థరాత్రి బయటకు వెళ్లారు. బాలికలు బయటకు వెళ్ళినప్పుడు రెండు సింహాలు దాడి
చేశాయి. ఇద్దరిలో ఒకరిని తెల్లవారుజామున 2 గంటలకు సింహం లాక్కెళ్లి చంపినట్లు అటవీ డిప్యూటీ కన్జర్వేటర్ సునీల్ బెర్వా
తెలిపారు. అధికారులు అందించిన వివరాల ప్రకారం సింహం అనుకోకుండా ఒక బాలిక పై దాడి చేయడంలో ఇంకొక అమ్మాయి ప్రక్కనున్న వాటర్ ట్యాంక్లోకి
దూకి తప్పించుకోగలిగింది.
ఆ బాలిక చేసిన అరుపులు
కారణంగా సమీపంలో ఉన్న మా అటవీ సిబ్బంది శబ్దం విన్న తరువాత అక్కడికి చేరుకున్నారు.
ఆ దాడిలో మృతి చెందిన బాలిక ప్రక్కనే రెండు సింహాలు వున్నాయి. ఆ తరువాత అవి
వెళ్లిన వెంటనే మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. హత్యకు గురైన
బాలికను భావన గా గుర్తించారు. ఆ బాలిక పంచమహల్ జిల్లాలోని గోద్రాకు చెందిన వ్యవసాయ
కూలీల కుటుంబానికి చెందినది. సింహాన్ని బంధించుటకు ఆ ప్రాంతంలో బోనులను ఏర్పాటు
చేసినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. గత ఆరు నెలల నుండి ఈ ప్రాంతంలో సింహాలు
తిరుగుతున్నట్లు అవి పశువులను వేటాడేందుకు అక్కడ వస్తున్నట్లు స్థానికులు తెలిపారు.