లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్డర్ పాటించాల్సిందే: కేజ్రీవాల్
By: chandrasekar Thu, 11 June 2020 5:04 PM
కరోనాకు సంబంధించి ఢిల్లీ
లెఫ్టినెంట్ గవర్నర్ ఇచ్చిన ఆదేశాలను కచ్చితంగా ఫాలో అవుతామని సీఎం అరవింద్
కేజ్రీవాల్ బుధవారం స్పష్టం చేశారు. ఇది పాలిటిక్స్కు టైం కాదని, విభేదాలకు
ఇది సమయం కాదని అన్నారు. సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లి, కరోనా
టెస్టులు నెగటివ్ వచ్చిన తర్వాత నిర్వహించిన మొదటి వీడియో బ్రీఫింగ్లో ఆయన ఈ
విషయాలు చెప్పారు. “ విభేదాలకు పాటించడానికి ఇది టైం కాదు. సెంట్రల్ డిసైడ్ చేసి, లెఫ్టినెంట్
గవర్నర్ ఆర్డర్ చేశారు. కాబట్టి కచ్చితంగా పాటించాల్సిందే” అని కేజ్రీవాల్
అన్నారు.
పార్టీలు కొట్టుకుంటూ
కూర్చుంటే కరోనా గెలుస్తుందని అప్పుడు మనం ఇంకా దారుణమైన పరిస్థితులు
ఎదుర్కోవాల్సి వస్తుందని అని, అందుకే అందరం ఏకమై కరోనాపై పోరు కొనసాగించాలని
అన్నారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హాస్పిట్సల్లో బెడ్లు ప్రొవైడ్ చేయడం ఒక
ఛాలెంజ్ అని అన్నారు.
ఈనెల 15
నాటికి ఢిల్లీలో దాదాపు 33వేల బెడ్లు అవసరం అవుతాయని, జులై
చివరికి 1.5 లక్షల
బెడ్లు అవసరం అవుతాయని అన్నారు. దీని కోసం స్టేడియంలు, ఫంక్షన్
హాల్స్, హోట్సల్లో
ఏర్పాట్లు చేస్తామని, ప్రజలకు కావాల్సినన్ని బెడ్లు ఇచ్చేందుకు శాయశక్తులా
ప్రయత్నిస్తామని అన్నారు.
ఢిల్లీ పరిధిలోని
హాస్పిట్సల్ను కేవలం లోకల్స్కు మాత్రమే రిజర్వ్ చేయాలని, బయటి
నుంచి వచ్చేవారికి కేంద్రం పరిధిలోని హాస్పిటల్స్ను ఉపయోగించాలని కేజ్రీవాల్
గవర్నమెంట్ నిర్ణయం తీసుకోగా దానిపై విమర్శలు వచ్చాయి. లెఫ్టినెంట్ జనరల్ అనిల్
బైజల్ కూడా ఆ నిర్ణయాన్ని వ్యతిరేకరించారు.