థియేటర్లకు వెళ్లి సినిమా చూడాలని ప్రేక్షకులను కోరిన ప్రభాస్...
By: Sankar Thu, 24 Dec 2020 5:19 PM
దాదాపు తొమ్మిది నెలలపాటు బిగ్ స్ర్కీన్పై సినిమా సందడి లేక థియేటర్లన్ని వెలవెలబోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ థియేటర్లలోకి వెళ్లి సినిమా చూసేందుకు జనాలు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. చాలా సినిమాలు ఓటీటీనే నమ్ముకొని అనేక సినిమాలు విడుదలయ్యాయి.
ఈ నేపథ్యంలో తాజాగా యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ థియేటర్ల రీఓపెనింగ్పై కామెంట్ చేశారు. ప్రేక్షకులందరూ థియేటర్లకు వెళ్లి సినిమాను చూడాలని కోరారు. జనాలు సురక్షితంగా సినిమా చేసే అనుభవాన్ని అందించేందుకు సినిమాలు తిరిగి వస్తున్నాయన్నారు.
ఈ సందర్భంగా ఓ వీడియోను విడుదల చేశారు. మన సినిమాను బిగ్ స్ర్కీన్లో ఎక్స్పీరియన్స్ చేద్దాం అని అభిమానులకు పిలుపునిచ్చారు ప్రభాస్. కాగా లాక్డౌన్ అనంతరం థియేటర్లలో విడుదలవున్న పెద్ద సినిమా సోలో బ్రతుకే సో బెటర్. క్రిస్మస్ సందర్బంగా రేపు థియేటర్ లోకి రానుంది.