Advertisement

  • ఐపీయల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు మెంటర్ గా ఆ దిగ్గజ ఆటగాడు నియామకం

ఐపీయల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు మెంటర్ గా ఆ దిగ్గజ ఆటగాడు నియామకం

By: Sankar Mon, 14 Sept 2020 12:24 PM

ఐపీయల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు మెంటర్ గా ఆ దిగ్గజ ఆటగాడు నియామకం


మరొక అయిదు రోజుల్లో ఐపీయల్ 13 వ సీజన్ యూఏఈ లో ప్రారంభం అవుతున్న తరుణంలో అన్ని జట్లు తమ అస్త్రాలకు మరింత పదును పెట్టుకుంటున్నాయి..చాల కాలంగా కరోనా వలన క్రికెట్ కు దూరంగా ఉన్న క్రికెటర్లు నెట్స్ లో చెమటోడుస్తున్నారు..ఫ్రాంచేజిలు కూడా ఐపీయల్ గెలవడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి..ఇందులో భాగంగా తమకి తొలి ఐపీయల్ లోనే టైటిల్ అందించిన దిగ్గజ ఆటగాడు షేన్ వార్న్ ను టీం మెంటర్ గా నియమించుకుంది రాజస్థాన్ రాయల్స్ జట్టు..

రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టుకు ఇప్పటికే ప్రచారకర్తగా ఉన్న ఆస్ట్రేలియా దిగ్గజం షేన్‌వార్న్‌ ఇప్పుడు ఈ కొత్త పాత్రలోకి ప్రవేశిస్తున్నాడు. జట్టులోని యువ ఆటగాళ్లను తీర్చి దిద్దేందుకు వార్న్‌ను టీమ్‌ మెంటార్‌గా ఎంపిక చేసినట్లు ఫ్రాంచైజీ ప్రకటించింది. టీమ్‌ కోచ్, తన విక్టోరియా జట్టు మాజీ సహచరుడు అయిన ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌తో కలిసి వార్న్‌ పని చేస్తాడు. ‘నా కుటుంబంలాంటి జట్టు రాజస్తాన్‌తో రాయల్స్‌తో మళ్లీ జత కట్టడం సంతోషంగా ఉంది. ఈ జట్టు కోసం ఏ రూపంలో అయినా పని చేయడాన్ని నేను ప్రేమిస్తాను.అందుకే ఇకపై ద్విపాత్రాభినయానికి సిద్ధమయ్యాను’ అని వార్న్‌ వ్యాఖ్యానించాడు.

జట్టు మెంటార్‌గా పని చేసేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాన్ని ఈ మాజీ లెగ్‌స్పిన్నర్‌ తాజా సీజన్‌లో రాయల్స్‌ మంచి ప్రదర్శన ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. 2008లో జరిగిన తొలి ఐపీఎల్‌ను షేన్‌ వార్న్‌ నాయకత్వంలోనే రాజస్తాన్‌ గెలుచుకుంది. అప్పటినుంచి ఏదో ఒక రూపంలో టీమ్‌తో అతను తన అనుబంధాన్ని కొనసాగిస్తున్నాడు. శనివారమే అతను తన 51వ పుట్టిన రోజు జరుపుకున్నాడు.

Tags :
|

Advertisement