Advertisement

  • క్షీణించిన ఎస్పీ బాలు ఆరోగ్యం ..ఆందోళనలో అభిమానులు

క్షీణించిన ఎస్పీ బాలు ఆరోగ్యం ..ఆందోళనలో అభిమానులు

By: Sankar Fri, 25 Sept 2020 06:20 AM

క్షీణించిన ఎస్పీ బాలు ఆరోగ్యం ..ఆందోళనలో అభిమానులు


ఎస్పీ బాలు ఆరోగ్యం విషమించడం గందరగోళాన్ని సృష్టిస్తుంది. నిన్నటి వరకు కోలుకుంటున్నారనుకున్న బాలు . తిరిగి అస్వస్థతకు గురయ్యారు. గత 40 రోజులుగా ఆయన కరోనా సోకడంతో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమించిందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఎంజీఎం ఆసుపత్రి సిబ్బంది బాలు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.

గడిచిన 24 గంటల్లో బాలు ఆరోగ్యం క్షీణించిందని వైద్యులు తెలిపారు.ఎక్మో, వెంటిలేటర్ , ఇతర ప్రాణధార చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలుపుతున్నారు. బాలు ఆరోగ్యం మరింత క్షీణిస్తుందని హెల్త్ బులిటెన్ విడుదల చేశారు ఎంజీఎం ఆసుపత్రి సిబ్బంది. ఆగస్టు 5న కరోనా వైరస్ బారిన పడిన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెన్నై లోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. రోజూ ఆయన ఆరోగ్యంపై ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ ను విడుదల చేస్తున్నారు.

అదేవిధంగా రోజూ తండ్రి ఆరోగ్య పరిస్థితి ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ సోషల్ మీడియా వేదికగా వివరిస్తున్నారు .అయితే కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ పెరగటంతో అప్పట్లో ఆయన ఆరోగ్యం క్షీణించింది. దాంతో అప్పటి నుంచి ఆయన ఎక్మో సపోర్టుతో చికిత్స తీసుకుంటున్నారు.

Tags :
|

Advertisement