ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్
By: Sankar Sun, 25 Oct 2020 4:15 PM
అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన టిమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కోలుకుని ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల కపిల్కు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు న్యూఢిల్లీలోని ఓ ప్రవైటు ఆస్పిత్రిలో చేర్పించగా అదే రోజు రాత్రి వైద్యులు ఆయనకు ఆపరేషన్ చేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండటంతో వైద్యులు ఆయనను డిశ్చార్జ్ చేసినట్లు మాజీ క్రికెటర్ చెతన్శర్మ ఆదివారం ట్విటర్ వేదికగా ప్రకటించాడు. కపిల్ దేవ్ ఆస్పత్రి వైద్యుడితో దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. ‘వైద్యుడు అతుల్ మాథుర్ కపిల్ పాజీకి యాంజియోప్లాస్టీ చేశాడు. ప్రస్తుతం కపిల్ కోలుకోవడంతో ఈ రోజు ఉదయం ఆయనను డిశ్చార్జ్ చేశారు’ అంటూ చేతన్ శర్మ ట్వీట్ చేశాడు..
అయితే అక్టోబర్ 23 రాత్రి కపిల్కు గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేరిన ఆయనకు వైద్యులు యాంజియోప్లాస్టీ చేశారు. అనంతరం ఆయనను ఐసీయుకు తరలించారు. ఇదే విషయాన్ని కపిల్ తర్వాత రోజు ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.ఇండియన్ దిగ్గజ క్రికెటర్లలో ఒకడైన కపిల్ కి అనారోగ్యం అని తెలియడంతో క్రికెట్ అభిమానులు ఆందోళన చెందారు ..అయితే అయన ఇపుడు డిశ్చార్జ్ కావడం అభిమానులకు ఆనందం కలిగించే విషయం..