Advertisement

ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష కు లీగల్ నోటీసులు..!

By: Anji Sun, 30 Aug 2020 12:55 PM

ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష కు లీగల్ నోటీసులు..!

ఆంధ్రజ్యోతి పత్రిక ఎండి రాధాకృష కు ఏపీలోని 13 జిల్లాల కలెక్టర్లు లీగల్ నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు స్టేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్రెడ్డి లీగల్ నోటీసులు పంపారు. కలెక్టర్ల కహానీ పేరుతో హనీ ట్రాప్ గురించి ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనం పై కలెక్టర్లు మండిపడ్డారు. ఆ పత్రిక ఎలాంటి ఆధారాలు లేకుండా పనిగట్టుకుని తమపై అనైతిక ఆలోచనలతో పూర్తి అవాస్తవాలు ప్రచురించిందని.. కావున దానిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని నిర్ణయించామని కలెక్టర్లు తెలిపారు.

కరోనా లాంటి విపత్కర సమయంలో ప్రజలందరికి సక్రమంగా సంక్షేమ పధకాలను అందచేస్తున్నామని.. అలాగే వినూత్న నిర్ణయాలతో ప్రజలకు అత్యంత చేరువగా పాలన అందించడం ద్వారా దేశంలోనే ఏపీలో కలెక్టర్ల వ్యవస్థకు మంచి పేరు వచ్చిందని గుర్తు చేశారు. దేశానికి ఆదర్శంగా ఏపీ కలెక్టర్ల వ్యవస్థ తయారైందని.. అలాంటి కలెక్టర్ల వ్యవస్థపై కుట్రపూరిత ఆలోచనతోనే ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలతో దాడి చేస్తోందని మండిపడ్డారు.

తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు నిరాధార కథనాలను దురుద్దేశపూర్వకంగా ప్రచురిస్తున్నారని.. వీటిని చూస్తూ ఊరుకుంటే కలెక్టర్లు స్వేచ్ఛగా పని చేయలేరని కావున చట్ట ప్రకారం ముందుకు వెళ్తామని కలెక్టర్లు తెలియజేశారు.

Tags :

Advertisement