Advertisement

  • ఆర్సీబి జట్టులో కీలక మార్పు ..ఫాస్ట్ బౌలర్ స్థానంలో స్టార్ లెగ్ స్పిన్నర్ కు చోటు

ఆర్సీబి జట్టులో కీలక మార్పు ..ఫాస్ట్ బౌలర్ స్థానంలో స్టార్ లెగ్ స్పిన్నర్ కు చోటు

By: Sankar Tue, 01 Sept 2020 2:33 PM

ఆర్సీబి జట్టులో కీలక మార్పు ..ఫాస్ట్ బౌలర్ స్థానంలో స్టార్ లెగ్ స్పిన్నర్ కు చోటు


మరికొద్ది రోజుల్లో ఐపీయల్ ప్రారంభం అవుతుంది అనగా రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు టీంలో కీలక మార్పు చోటు చేసుకుంది.. ఆస్ట్రేలియాకి చెందిన ఫాస్ట్ బౌలర్ కేన్ రిచర్డ్‌సన్ ఆర్సీబీ టీమ్ నుంచి అనూహ్యంగా తప్పుకున్నాడు. అతని భార్య త్వరలోనే ఓ బిడ్డకి జన్మనివ్వబోతుండటంతో ఆ సమయంలో ఆమె చెంత ఉండాలని ఆశిస్తున్న రిచర్డ్‌సన్.. ఐపీఎల్ 2020 సీజన్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు..

దాంతో.. ఆస్ట్రేలియాకే చెందిన లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపాని అతని స్థానంలో బెంగళూరు టీమ్ తీసుకుంది.ఆర్సీబీ జట్టుని పరిశీలించిన తర్వాత టీమ్‌లో మరొక లెగ్ స్పిన్నర్ ఉంటే.. బాగుంటుందని భావించాం. ఇప్పటికే జట్టులో చాహల్ ఉన్నాడు. అతనికి సపోర్ట్‌గా ఆడమ్ జంపా కూడా ఉంటే.. ఒకవేళ యూఏఈ పిచ్‌లు స్పిన్‌కి అనుకూలించినప్పుడు జట్టుకి ప్రయోజనం చేకూరనుంది’’ అని మైక్ హసన్ వెల్లడించాడు..

ఐపీఎల్ 2020 సీజన్ ఆటగాళ్ల వేలానికి రూ. 1.5 కోట్ల కనీస ధరతో వచ్చిన కేన్ రిచర్డ్‌సన్‌ని రూ.4 కోట్లకి ఆర్సీబీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఆడమ్ జంపా కూడా వేలానికి రూ. 1.5 కోట్లతో వచ్చాడు. కానీ.. అతడ్ని ఎవరూ కొనుగోలు చేయలేదు. అయితే.. ఇప్పుడు టీమ్‌లోకి తీసుకున్న ఆర్సీబీ.. జంపాకి కనీస ధరని చెల్లించాల్సి ఉంటుంది.

Tags :

Advertisement