ప్రముఖ ఒప్పో స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఒప్పో రెనో 4 ప్రొ ఫోన్ విడుదల చేసింది
By: chandrasekar Sat, 01 Aug 2020 5:55 PM
భారత్లో చైనాకు చెందిన
ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఒప్పో ఇవాళ
కొత్త ఫోన్ను విడుదల చేసింది. ఆన్లైన్ లాంచ్ ఈవెంట్లో స్మార్ట్ఫోన్ను ఆవిష్కరించింది. భారత్లో
ఫోన్ ధర రూ.34,990గా ఉంది. ఆగస్టు 5 నుంచి విక్రయాలు ప్రారంభించనుంది.
స్టార్రి నైట్, సిల్కీ
వైట్ రెండు కలర్లలో వస్తున్నది. 8జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్ వేరియంట్ను మాత్రమే విడుదల చేసింది. ఆన్లైన్, ఆఫ్లైన్
స్టోరల్లో ఫోన్ల అమ్మకాలు ప్రారంభంకానున్నాయని కంపెనీ పేర్కొంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్, పేటీఎం
మాల్, స్నాప్డీల్
తదితర ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా వినియోగదారులు ఫోన్లను కొనుగోలు చేయొచ్చు.
ఒప్పో రెనో 4 ప్రో
స్పెషిఫికేషన్లు:
డిస్ప్లే: 6.50
అంగుళాలు
ఫ్రంట్ కెమెరా: 32 మెగా
పిక్సల్
రియర్ కెమెరా: 48+8+2+2 మెగా పిక్సల్
స్టోరేజ్: 128జీబీ
ర్యామ్: 8జీబీ
బ్యాటరీ: 4000mAh