ప్రముఖ నటుడు కోసూరి వేణుగోపాల్ కరోనా వల్ల మృతి
By: chandrasekar Thu, 24 Sept 2020 10:24 AM
ప్రముఖ నటుడు కోసూరి
వేణుగోపాల్ కరోనా వల్ల బుధవారం మృతి చెందారు. కరోనా వైరస్ మరో తెలుగు నటుడిని బలి
తీసుకుంది. ప్రముఖ సినీ, టీవీ నటుడు కోసూరి వేణుగోపాల్ కరోనా బారిన పడి
చికిత్స పొందుతూ మరణించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో 22
రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. దీంతో బుధవారం
కన్నుమూశారు. అనారోగ్యంతో కోలుకోక పోవడంతో మృతి చెందారు.
ఈయన నటన అభిమానులను బాగా
ఆకట్టు కొనేది. పశ్చిమ గోదావరి జిల్లా
నరసాపురానికి చెందిన వేణుగోపాల్ ఎఫ్సీఐలో మేనేజర్గా పనిచేసి రిటైర్ అయ్యారు.
ఉద్యోగం చేస్తూనే సినిమాల్లో నటించేవారు. మర్యాద రామన్న, విక్రమార్కుడు, ఛలో, పిల్ల
జమిందారు వంటి అనేక సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందారు. వేణుగోపాల్ మృతి
పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టాలీవుడ్ మంచి నటుడిని
కోల్పోయిందంటూ అనేక మంది తమ సంతాపం ప్రకటించారు. ఇలాంటి గొప్ప నటుడు కరోనా వల్ల
మృతి చెందడం చాలా బాధాకరంగా ఉన్నట్లు అభిమానులు తెలిపారు.