వైఎస్ జగన్ కు ధన్యవాదాలు తెలిపిన ప్రముఖ నటుడు కమల్ హాసన్
By: chandrasekar Tue, 29 Sept 2020 09:39 AM
వైఎస్ జగన్ కు ట్విట్టర్
వేదికగా తన ధన్యవాదాలు తెలియజేసిన ప్రముఖ నటుడు కమల్ హాసన్. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు నటుడు పద్మ
భూషణ్ కమల్ హాసన్ ధన్యవాదాలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రికి థ్యాంక్స్ చెప్పారు.
లెజెండరీ సింగర్ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకు భారత రత్న ఇవ్వాలనే డిమాండ్
పెరుగుతోంది. అభిమానుల్లో పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ సీఎం
వైఎస్ జగన్ స్పందించారు. వివిధ భాషల్లో ఎస్పీ బాలు చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు
భారత రత్న పురస్కారం అందించాలంటూ సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోడీకు లేఖ రాశారు. తమ
అభిమాన గాయకుడు బాలుకు భారత రత్న ఇవ్వాలంటూ ప్రధాని మోడీకు వైఎస్ జగన్ లేక రాయడంపై
సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఎస్పీ బాలు అభిమానులు, సినీ
ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
జగన్ దీనిపై స్పందించి
ప్రధానికి లేఖ వ్రాయడంతో సర్వత్రా ఆనందం వెలువడుతుంది. ఇందులో భాగంగా విలక్షణ నటుడిగా ముద్రపడిన కమల్
హాసన్ ఏపీ సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. ట్విట్టర్ లో ఈ మేరకు పోస్ట్ చేశారు.
సోదరుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కోసం మీరు చేసిన వినతి గౌరవమైనది మరియు సరైనది.
దీనిపై తమిళనాడులోనే కాదు దేశమంతా ఉన్న బాలు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తారంటూ
ట్వీట్ చేశారు. అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స
పొందుతూ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కన్నుమూశారు. కరోనా వైరస్ బారిన పడిన ఆయన గత 50
రోజులుగా చికిత్స తీసుకుంటున్నారు. వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ ఆరోగ్యం
కుదుటపడకపోవడంతో చివరికి తుది శ్వాస విడిచారు. ఒక ప్రఖ్యాత గాయకుడిని
పోగొట్టుకోవడంతో అభిమానులు భావోద్వేగానికి లోనయ్యారు.