జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు మరొక పార్టీకి జంప్
By: chandrasekar Fri, 20 Nov 2020 11:09 AM
వేడి వేడిగా జీహెచ్ఎంసీ
ఎన్నికల కోసం జరుగుతున్న సంబరాల్లో టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు మరొక
పార్టీలోనికి జంప్ అవుతున్నారు. ఈ క్రమంలో
గురువారం ఓ ఆసక్తికర పరిణామం తెలంగాణాలో చోటు చేసుకుంది. టీఆర్ఎస్పై అసహనంతో
గురువారం ఉదయం బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్న ఓ
నాయకుడు రాత్రయ్యే సరికి తిరిగి తన సొంత గూటికి చేరారు. మంత్రి హరీశ్ రావు ఆయన్ను
వెనక్కు పిలిపించినట్లుగా ప్రకటించారు. గురువారం ఉదయం వెంగళ్ రావు నగర్ సిట్టింగ్
టీఆర్ఎస్ కార్పొరేటర్ కిలారి మనోహర్, రామచంద్రాపురం కార్పొరేటర్ అంజయ్య యాదవ్లు బీజేపీలో
చేరారు. టీఆర్ఎస్నుంచి టికెట్ ఇవ్వకపోవటంతో గురువారం బీజేపీలోకి జంప్ అయ్యారు.
దీంతో వెంటనే మంత్రి హరీశ్ రావు రంగంలోకి దిగి అంజయ్య యాదవ్కు నచ్చ జెప్పి మళ్లీ
సొంత గూటికి లాక్కొచ్చారు. ఇలా సీట్లు రానివారిని బుజ్జగించాల్సి వుంది.
ఈ సంఘటన తరువాత మంత్రి
హరీశ్ మాట్లాడుతూ, తోట అంజయ్య యాదవ్ను తిరిగి సొంత గూటికి ఆహ్వానించాం.
టీఆర్ఎస్ పార్టీ నుంచి పేరు టిక్కెట్ ఆశించిన ప్రతి ఒక్కరు పార్టీపై గౌరవంతో
ఉన్నారు. పార్టీలో పోటీ చేసే వారు ఎక్కువ అవడం వల్ల కొంత ఇబ్బంది ఏర్పడింది.
ఆశించిన ప్రతి ఒక్కరికి మంచి అవకాశాలు కల్పిస్తాం.’’ అని తెలిపారు. ఇప్పుడు
దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ బీజేపీ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసే
ప్రయత్నం చేస్తోంది. లింగంపల్లిలోని బీహెచ్ఎల్ని నిలబెట్టిన ఘనత టీఆర్ఎస్
ప్రభుత్వానిదే. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కార్మికులను రోడ్డున పడేస్తోంది. ఏది
ఏమైనా ఈ మూడు డివిజన్లలో మా అభ్యర్థులను బారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. ఈ
ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం పని చేస్తున్న టీఆర్ఎస్కు ప్రజలు పట్టం కడతారని
మాకు సంపూర్ణ నమ్మకం ఉంది. కాంగ్రెస్, బీజేపీ కేవలం ఎన్నికల కోసం మాత్రం ప్రజల వద్దకు
వస్తున్నారు. ఆలాంటి పార్టీలకు ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి
చెబుతారు. ఈ రోజు మా పార్టీ నుంచి టిక్కెట్ ఆశించినవారిని కుటుంబ సభ్యులుగా
చూసుకుంటాం అని హరీశ్ రావు వెల్లడించారు. నామినేషన్లు పూర్తయ్యే వరకు ఇలాంటి
సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి.