Advertisement

  • హత్రాస్ బాధితురాలి తరుపున వాదిస్తా ..నిర్భయ కేసులో వాదించిన లాయర్

హత్రాస్ బాధితురాలి తరుపున వాదిస్తా ..నిర్భయ కేసులో వాదించిన లాయర్

By: Sankar Fri, 02 Oct 2020 2:49 PM

హత్రాస్ బాధితురాలి తరుపున వాదిస్తా ..నిర్భయ కేసులో వాదించిన లాయర్


హత్రాస్ హత్యాచారం ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే..దోషులను కఠినంగా శిక్షించాలని దేశ వ్యాప్తంగా నివాసనలు చేస్తున్నారు..అయితే నిర్భయ హత్యాచారం కేసును ఛాలెంజ్‌గా తీసుకుని దోషులకు శిక్షపడేలా చేసిన యువ మహిళా న్యాయవాది సీమా కుష్వాహా.. హాథ్రాస్‌ కేసులోనూ వాదనలు వినిపించనున్నట్టు తెలుస్తోంది.

బాధితురాలి కుటుంబాన్ని కలిసేందుకు సీమా గురువారం ప్రయత్నించగా.. పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. అయితే, తాను మాత్రం వారిని కలవకుండా తిరిగి వెళ్లేదిలేదని తెగేసిచెప్పారు. సీమా మీడియాతో మాట్లాడుతూ ..‘తమ తరఫున నిలబడి న్యాయం చేయాల్సిందిగా బాధితురాలి కుటుంబ సభ్యులు కోరారు. అయితే అధికారులు మాత్రం వారిని కలిసేందుకు అనుమతించడం లేదు. కానీ ఆ కుటుంబాన్ని కలవకుండా నేను తిరిగి వెళ్లేది లేదు’ అని స్పష్టం చేశారు. బాధితురాలి సోదరుడితో తాను మాట్లాడుతున్నట్టు ఆమె తెలిపారు.

హాథ్రాస్‌‌ ఘటనలో 19 ఏళ్ల దళిత యువతిపై నలుగురు అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఆమెను దారుణంగా హింసించడంతో తీవ్రంగా గాయపడిన బాధితురాలిని తొలుత అలీగఢ్ యూనివర్సిటీ మెడికాల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో తర్వాత ఢిల్లీలో సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మంగళవారం ఉదయం మృతిచెందింది.

Tags :
|

Advertisement