రూ.7 వేల లోపు 'లావా బీయూ ఆండ్రాయిడ్ గో ఎడిషన్' మొబైల్ లాంచ్
By: chandrasekar Wed, 23 Dec 2020 10:01 AM
భారతీయ స్మార్ట్ ఫోన్
బ్రాండ్ 'లావా
బీయూ ఆండ్రాయిడ్ గో ఎడిషన్' తన కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ను ప్రకటించింది.
బడ్జెట్ ధరలో ఈ ఫోన్ రూ.6,888 కు లభించనుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను మహిళల కోసం ప్రత్యేకంగా తయారుచేసినట్లు కంపెనీ
తెలిపింది. ఇందులో మహిళల రక్షణ కోసం ప్రత్యేక యాప్ను అందించారు. ప్రస్తుత
పరిస్థితులలో ఇది చాలా ఉపయోగపడనున్నట్లు తెలిపారు.
స్పెసిఫికేషన్ వివరాలు:
* ఈ ఫోన్ లో 6.08 అంగుళాల హెచ్డీ+ డిస్ ప్లేను అందించారు. డిస్ప్లే
రిజల్యూషన్ 1560 x 720 పిక్సెల్స్గా ఉంది మరియు యాస్పెక్ట్ రేషియో 19.5:9గా ఉంది.
* ఇందులో 1.6 గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉపయోగించారు.
* ఫోన్ లో 2 జీబీ ర్యామ్,
32 జీబీ స్టోరేజ్ను అందించారు. దీన్ని మైక్రోఎస్డీ
కార్డు ద్వారా 256 జీబీ పెంచుకోవచ్చు.
* ఈ ఫోన్ లో
వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. ఈ కెమెరా సామర్థ్యం 13
మెగాపిక్సెల్ కాగా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, ఎల్ఈడీ
ఫ్లాష్ కూడా ఇందులో ఉన్నాయి.
* సెల్ఫీ కోసం ముందువైపు 8
మెగాపిక్సెల్ కెమెరా అందించారు.
* ఆండ్రాయిడ్ 10 గో ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.
* దీనిలో బ్యాటరీ
4060
ఎంఏహెచ్గా అందించారు.
* ఫోన్ వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించారు.
* ఈ ఫోన్ 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ 4.2,
జీపీఎస్, గ్లోనాస్, డ్యూయల్ సిమ్, మైక్రో యూఎస్బీ పోర్టులను అందుబాటులో వున్నాయి. ఈ
ఫోన్ మందం 0.98 సెంటీమీటర్లుగానూ, బరువు 175.8
గ్రాములుగానూ ఉండనుంది.