Advertisement

  • రూ.7 వేల లోపు 'లావా బీయూ ఆండ్రాయిడ్ గో ఎడిషన్' మొబైల్ లాంచ్

రూ.7 వేల లోపు 'లావా బీయూ ఆండ్రాయిడ్ గో ఎడిషన్' మొబైల్ లాంచ్

By: chandrasekar Wed, 23 Dec 2020 10:01 AM

రూ.7 వేల లోపు 'లావా బీయూ ఆండ్రాయిడ్ గో ఎడిషన్' మొబైల్ లాంచ్


భారతీయ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ 'లావా బీయూ ఆండ్రాయిడ్ గో ఎడిషన్' తన కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌ను ప్రకటించింది. బడ్జెట్ ధరలో ఈ ఫోన్ రూ.6,888 కు లభించనుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను మహిళల కోసం ప్రత్యేకంగా తయారుచేసినట్లు కంపెనీ తెలిపింది. ఇందులో మహిళల రక్షణ కోసం ప్రత్యేక యాప్‌ను అందించారు. ప్రస్తుత పరిస్థితులలో ఇది చాలా ఉపయోగపడనున్నట్లు తెలిపారు.

స్పెసిఫికేషన్ వివరాలు:

* ఈ ఫోన్ లో 6.08 అంగుళాల హెచ్‌డీ+ డిస్ ప్లేను అందించారు. డిస్ప్లే రిజల్యూషన్ 1560 x 720 పిక్సెల్స్‌గా ఉంది మరియు యాస్పెక్ట్ రేషియో 19.5:9గా ఉంది.

* ఇందులో 1.6 గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్‌ ఉపయోగించారు.

* ఫోన్ లో 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌ను అందించారు. దీన్ని మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా 256 జీబీ పెంచుకోవచ్చు.

* ఈ ఫోన్ లో వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. ఈ కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఇందులో ఉన్నాయి.

* సెల్ఫీ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.

* ఆండ్రాయిడ్ 10 గో ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.

* దీనిలో బ్యాటరీ 4060 ఎంఏహెచ్‌గా అందించారు.

* ఫోన్ వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించారు.

* ఈ ఫోన్ 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ 4.2, జీపీఎస్, గ్లోనాస్, డ్యూయల్ సిమ్, మైక్రో యూఎస్‌బీ పోర్టులను అందుబాటులో వున్నాయి. ఈ ఫోన్ మందం 0.98 సెంటీమీటర్లుగానూ, బరువు 175.8 గ్రాములుగానూ ఉండనుంది.

Tags :
|

Advertisement