అత్యంత చవకైన షియోమీ ల్యాప్టాప్ మనదేశంలో లాంచ్...
By: chandrasekar Fri, 06 Nov 2020 11:12 AM
మనదేశంలో ఎంఐ నోట్బుక్ 14
ఈ-లెర్నింగ్ ఎడిషన్ లాంచ్ అయింది. షియోమీ లాంచ్ చేసిన అత్యంత చవకైన ల్యాప్ టాప్
ఇదే. కరోనావైరస్ను దృష్టిలో పెట్టుకుని వర్క్ ఫ్రం హోం, ఆన్
లైన్ క్లాసులకు ఉపయోగపడేలా దీన్ని రూపొందించారు. ఇందులో ఇంటెల్ కోర్ ఐ3
ప్రాసెసర్ను అందించారు. మిగతా ఎంఐ ల్యాప్టాప్ల మాదిరిగా కాకుండా ఇందులో
ఇన్-బిల్ట్ వెబ్ క్యాంను అందించారు.
ఎంఐ నోట్బుక్ 14 ధర
మరియు స్పెసిఫికేషన్లు...
ఎంఐ నోట్బుక్ 14 ధరను
రూ.34,999గా నిర్ణయించారు. దీనిలో కేవలం 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ మాత్రమే అందుబాటులో ఉంది. కేవలం
సిల్వర్ రంగులో మాత్రమే ఇది లాంచ్ అయింది.
ఎంఐ నోట్ బుక్ 14 ఐ5
వేరియంట్ ధర రూ.41,999 నుంచి ప్రారంభం కానుంది.
దీనికి సంబంధించిన సేల్
ఇప్పటికే అమెజాన్, ఎంఐ.కాం, ఆఫ్లైన్లో ప్రారంభం అయింది.
దీనిలో విండోస్ 10 హోం
ఆపరేటింగ్ సిస్టంను అందించారు. ఇంటెల్ కోర్ ఐ3
10th జనరేషన్ ప్రాసెసర్పై ఈ ల్యాప్ టాప్ పనిచేయనుంది.
ఇంటెల్ యూహెచ్డీ గ్రాఫిక్స్ ఇందులో ఉన్నాయి.
8 జీబీ డీడీఆర్4 ర్యామ్,
256 జీబీ శాటా 3 స్టోరేజ్ను ఇందులో అందించారు.
ఎంఐ నోట్బుక్ 14
ముందువెర్షన్ ఐ5 ప్రాసెసర్తో లాంచ్ అయింది.
ఇందులో 512 జీబీ
ఎస్ఎస్డీ వరకు అందుబాటులో ఉంది.14 అంగుళాల ఫుల్ హెచ్డీ యాంటీ-గ్లేర్ డిస్ ప్లేను
ఇందులో అందించారు.
దీని యాస్పెక్ట్ రేషియో 16:9గా ఉండగా, స్క్రీన్ టు బాడీ రేషియో 81.2
శాతంగా ఉంది.
ఆన్ లైన్ మీటింగ్స్, క్లాసెస్, వీడియో
కాల్స్ కోసం ఇందులో హెచ్డీ వెబ్ క్యాంను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 3220
ఎంఏహెచ్గా ఉంది.
10 గంటల వరకు దీని బ్యాటరీ వస్తుంది.
రెండు యూఎస్బీ
టైప్-ఏ పోర్టులు, యూఎస్బీ 2.0 పోర్టు, హెచ్డీఎంఐ పోర్టు, కాంబో ఆడియో జాక్ వంటి
కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.
డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్
5.0 వంటి
వైర్ లెస్ కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. రెండు 2W స్పీకర్లను
ఇందులో అందించారు.
డీటీఎస్ ఆడియో
ప్రాసెసింగ్ యాప్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. కేవలం 1.5 కేజీలు మాత్రమే దీని
బరువు.