Advertisement

Shocking News: హైదరాబాద్ లో వరద సహాయం పంపిణీ విషయంలో...!

By: Anji Fri, 18 Dec 2020 4:24 PM

Shocking News: హైదరాబాద్ లో వరద సహాయం పంపిణీ విషయంలో...!

హైదరాబాద్‌లో మూడు నెలల క్రితం సంభవించిన బట్ వరదల కారణంగా నష్టపోయిన కుటుంబాలను ఆదుకొనే లక్ష్యంతో ప్రభుత్వం రూ.10 వేల ఆర్థిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. జీహెచ్ఎంసీ తరపున రూ.10 వేలు అందిస్తున్నారు.

అయితే, ఈ పథకం ఎన్నో విమర్శలకు తావిచ్చింది. చివరికి జీహెచ్ఎంసీ ఎన్నికల కారణంగా వరద సాయం పంపిణీ వాయిదా పడింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే పంపిణీ తిరిగి ప్రారంభం అవుతుందని సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆరే ప్రకటించారు.

దీంతో ఎన్నికలు పూర్తయిన తర్వాత బాధితులు మీ-సేవలో దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నించారు. మరోవైపు, అధికారులే బాధితుల వద్దకు వెళ్లి వారి వివరాలు తీసుకుంటున్నారని జీహెచ్ఎంసీ అధికారులు ప్రకటించారు.

ఎన్నికల తర్వాత కూడా వరద సాయం బాధితులకు అందలేదనే విమర్శలు వచ్చాయి. బల్దియా ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ హామీ ఇచ్చిన స్థాయిలో పంపిణీ జరగడం లేదని ఆరోపణలు సైతం ఉన్నాయి.

కానీ జీహెచ్ఎంసీ మాత్రం వరద సాయం కొనసాగుతోందని వెల్లడించింది. తాజాగా ఈ వరద సాయానికి సంబంధించి కొందరు సమాచారం హక్కు చట్టం ద్వారా వివరాలు అడిగారు. అయితే, వారు అడిగిన ప్రశ్నలకు జీహెచ్ఎంసీ నుంచి ఆశించిన స్థాయిలో సమాధానం రాకపోవడం గమనార్హం.

సమాచార హక్కు చట్టం కింద అడిగిన వివరాల ప్రకారం.. వరదల కారణంగా చనిపోయిన వారిలో 30 మందికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించినట్టు జీహెచ్ఎంసీ వెల్లడించింది. వారి వివరాలు కూడా పేర్కొంది.

అయితే జీహెచ్ఎంసీ పరిధిలో వరద బాధితుల్లో లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన మార్గదర్శకాలు ఎలా ఉన్నాయనే విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వలేదు.

ఇందుకు సంబంధించిన సమాచారం తమ వద్ద లేదని జీహెచ్ఎంసీ తోసిపుచ్చింది. బాధితులను గుర్తించేందుకు నిపుణుల నివేదికలు ఏమైనా ఉన్నాయా? అనే ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వకపోవడం గమనార్హం.

Tags :

Advertisement